టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

TDP Internal Clashes In Sattenapalli Guntur District - Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయట పడ్డాయి. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈనెల 29న(ఎల్లుండి)పార్టీ ఆవిర్భావదివ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో వివాదం చెలరేగింది. వైవీ ఆంజనేయులు వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కోడెల శివరాం వర్గం పడివేసింది.

ఈ క్రమంలో  ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి యత్నించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.  ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top