
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్ను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు జరుగునున్నాయి. కాగా, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుందని ఎస్సెస్సీ పరీక్షల విభాగం తెలిపింది.