Mega Job Mela Was Started By Mp Vijaya Sai Reddy In Guntur, Over 100 Firms To Recruit Youth - Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ముఖ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి

Published Thu, Jun 22 2023 2:37 PM

Mega Job Mela Was Started By Mp Vijaya Sai Reddy In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: గతేడాది వైఎస్సార్‌సీపీ తరఫున 4 వర్శిటీల్లో జాబ్‌ మేళాలు నిర్వహించి 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మెగా జాబ్‌ మేళాను ప్రారంభించారు.

ఈ జాబ్‌ మేళాకు దేశవ్యాప్తంగా ఉన్న 100 ప్రముఖకంపెనీలు ప్రతినిధులు హాజరయ్యారు.10 వేలకుపైగా ఉద్యోగావకాశాలే లక్ష్యంగా రెండు రోజుల పాటు జాబ్‌ మేళా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ‘‘విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ముఖ్యం. ప్రతి విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక రంగంలో రాణించేందుకు ప్రయత్నించాలి’’ అని సూచించారు.
చదవండి: రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ నోటీసులు

Advertisement
Advertisement