ప్రాణం తీసిన ఖర్జూరం | Man Dead With Eating of Dates in Penukonda Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఖర్జూరం

Dec 7 2025 6:58 AM | Updated on Dec 7 2025 7:01 AM

Man Dead With Eating of Dates in Penukonda Andhra Pradesh

పెనుకొండ: ఊపిరితిత్తుల్లో ఖర్జూరం ఇరుక్కుని శ్రీస­త్య­సాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్‌ (46) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నా­యి. పట్టణంలోని తోటగే­రికి చెందిన గంగాధర్‌ గతంలో ఫ్లెక్సీలు వేస్తుండేవాడు. ప్రస్తుతం కార్లు అద్దెకు నడుపుతు­న్నాడు. ఆయన ఇటీవల గొంతు సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. 

గురు­వారం రాత్రి ఇంట్లో ఖర్జూరం తింటుండగా విత్తనం పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో ఊపిరాడలేదు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభు­త్వాస్పత్రికి, అక్కడి నుంచి పట్టణంలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యు­ల సూచన మేరకు అనంతపురం తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement