అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌ | Kambhampati Haribabu Inaugurated GAN 2K23 National Technology Fest | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌: మిజోరాం గవర్నర్‌

Jan 7 2023 9:09 AM | Updated on Jan 7 2023 9:47 AM

Kambhampati Haribabu Inaugurated GAN 2K23 National Technology Fest - Sakshi

( ఫైల్‌ ఫోటో )

అభివృద్ధిలో దేశం దూసుకుపోతోందని మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు.

తగరపువలస (భీమిలి): నూతన విద్య, ఆర్థిక విధానాల కారణంగా అభివృద్ధిలో దేశం దూసుకుపోతోందని మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు. చెరకుపల్లిలోని అవంతి ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న గ్యాన్‌–2కే23 జాతీయ సాంకేతిక ఫెస్ట్‌ను శుక్రవారం ఆయన c. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అభివృద్ధిని నేటి తరం అనుభవిస్తుంటే తనకు అసూయగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ద్వారా దేశం తన అవసరాలను తీర్చుకోవడంతోపాటు విదేశాలకు అవసరమైన ఎగుమతులు చేయగలుగుతోందన్నారు. ప్రపంచానికి అవసరమైన సాంకేతికపరమైన డేటా మనదేశంలో చౌకగా లభిస్తుందన్నారు. విద్యార్థులు తన చుట్టూ ఉన్నవారికి, దేశానికి అవసరమైన వాటిని గుర్తించి ఉత్పత్తి చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించాలని సూచించారు.

అవంతి విద్యాసంస్థల చైర్మన్‌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కులం, డబ్బు వంటివాటితో పనిలేదన్నారు. తెలివితేటలు, కష్టపడే తత్వం అలవరచుకోవాలన్నారు. జేఎన్‌టీయూ–కె ఉపకులపతి ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు మాట్లాడుతూ విద్యార్థులు టెక్నికల్, సాఫ్ట్‌ స్కిల్స్, లైఫ్‌స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటూ నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్‌ ఎం.సైదులు, అవంతి విద్యాసంస్థల డైరెక్టర్‌ ఆకుల చంద్రశేఖర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఐ.శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం

Advertisement
 
Advertisement
Advertisement