ఈ ‘పరిషత్‌’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు | Ink mark to Little Finger In MPTC And ZPTC election In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఈ ‘పరిషత్‌’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు

Nov 11 2021 2:58 AM | Updated on Nov 11 2021 9:55 AM

Ink mark to Little Finger In MPTC And ZPTC election In Andhra Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.

సాక్షి, అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడుతుంటారు. కానీ.. ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.  

చదవండి: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే

పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చిటికెన వేలిపైన సిరా గుర్తు వేయాలని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement