ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, ట్రైనీలకు పోస్టింగ్స్‌ | IAS Transfers And New Postings For Trainees In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, ట్రైనీలకు పోస్టింగ్స్‌

Oct 8 2022 4:28 PM | Updated on Oct 8 2022 4:38 PM

IAS Transfers And New Postings For Trainees In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌గా విజయ సునీత, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌గా భావన, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌గా మల్లారపు నవీన్‌, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా సి. విష్ణు చరణ్‌, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా నిధిమీనా, ఏపీసీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీఅయ్యారు. 

మరోవైపు.. 2020 బ్యాచ్‌ ట్రైనింగ్‌ ఐఏఎస్‌లకు కూడా ప్రభుత్వం పోస్టింగ్స్‌ ఇచ్చింది. దీంతో, తెనాలి సబ్‌ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా శుభం బన్సల్‌, నరసాపురం సబ్‌ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజ, టెక్కలి సబ్‌ కలెక్టర్‌గా రవికుమార్‌ రెడ్డి, పాలకొండ సబ్‌ కలెక్టర్‌గా నూరుల్‌ కుమిర్‌, ఆదోని సబ్‌ కలెక్టర్‌గా అభిషేక్‌ కుమార్‌, విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా అధితిసింగ్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌గా కార్తీక్‌, గూడూరు సబ్‌ కలెక్టర్‌గా శోభిక, కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా మాధవన్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement