ఏలూరు ఘటన: సీఎం జగన్‌తో మాట్లాడిన గవర్నర్ | Governor Harichandan Speak To CM Jagan On Situation In Eluru | Sakshi
Sakshi News home page

ఏలూరు ఘటన: సీఎం జగన్‌తో మాట్లాడిన గవర్నర్

Dec 8 2020 7:20 PM | Updated on Dec 8 2020 7:37 PM

Governor Harichandan Speak To CM Jagan On Situation In Eluru - Sakshi

సాక్షి, అమరావతి: ఏలూరు పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను సీఎంను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని విజయవాడ తరలించామని.. గవర్నర్‌కు సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు. వ్యాధి మూలాలను గుర్తించేందుకు ఎయిమ్స్, ఎన్‌ఐఎన్‌, సీసీఎంబీ, ఐఐసీటీ సంస్థల సహకారం తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. గత మూడు రోజులుగా సుమారు 467 మంది వింత వ్యాధి బారినపడి ఆసుపత్రిలో చేరారని, ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందించటం వల్ల 263 మంది కోలుకుని తమ నివాసాలకు చేరుకున్నారన్నారని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. (చదవండి: నెరవేరనున్న సీఎం జగన్‌ మరో ఎన్నికల హామీ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement