ఆ పోస్టు పెట్టించింది నేనే: గోరంట్ల

Gorantla Butchaiah Chowdary Reaction On Social Media Post - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : వెంకటగిరిలో వినాయక విగ్రహానికి మలినం పూసిన ఘటనపై మత విద్వేషాలకు తావు లేకుండా చూడాలని చెప్పి, తన పీఏతో సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టించానని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. అయితే దాన్ని నేరంగా భావించి అతడిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐ, ఎస్పీలకు ఫోన్‌ చేసి, నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గోర్లంట పీఏ చిటికన సందీప్‌ను పోలీసులు మంగళవారం శ్రీశైలంలో అరెస్ట్‌ చేశారు. బొమ్మూరు స్టేషన్‌కు తీసుకువచ్చి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్‌ విధించారు. చదవండి: విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు

చదవండి: శ్రీరాం.. నీ బండారం బయటపెడతా! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top