
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది అకృత్యాలు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను వేధించిన యువకుడు తారకరత్న.. ఇంట్లో చెప్తే మీ నాన్నను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ బాలిక తండ్రికి చెప్పడంతో సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ వేధించాడు. భయాందోళనకు గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి.. ఆ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటుకున్నారు. పదో తరగతిలో 554 మార్కులు సాధించిన బాలిక.. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఇంటర్లో అడ్మిషన్ తీసుకుంది. ఎల్లుండి నుంచి క్లాస్లకు వెళ్లాల్సిన బాలిక ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడింది. తారకరత్న అనే యవకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడని విద్యార్థి తండ్రి చంద్రగిరి ఉత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.