ఓఎన్జీసీ బావిలో మళ్లీ ఎగసిపడ్డ మంటలు | Flames have flared up again at the ONGC well in Konaseema | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ బావిలో మళ్లీ ఎగసిపడ్డ మంటలు

Jan 8 2026 3:49 AM | Updated on Jan 8 2026 10:04 AM

Flames have flared up again at the ONGC well in Konaseema

డా. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ మోరి బావి నంబరు 5లో జరిగిన బ్లో అవుట్‌ ఇంకా కొనసాగుతోంది. భూగర్భం నుంచి వచ్చే గ్యాస్‌ ఒత్తిడి తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నానికి మంటల తీవ్రత తగ్గింది. అయితే గ్యాస్‌ ఒత్తిడి పెరిగినప్పుడు మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మార్పుల కారణంగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.  

బావిని పూర్తిగా మూసివేయడానికి అవసరమైన వెల్‌ క్యాపింగ్‌ ప్రక్రియపై అధికారులు ఇంకా స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు.  గ్యాస్‌ ఒత్తిడి స్థిరంగా లేకపోవడం వల్ల చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నప్పటికీ, మంటలు మళ్లీ ఎగసిపడటం ఆందోళన కలిగిస్తోంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement