తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య | Female constable commits suicide | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Jun 3 2024 7:24 AM | Updated on Jun 3 2024 7:24 AM

Female constable commits suicide

అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘటన  

రాయచోటి: అన్నమ­య్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ వేదవతి (26) గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

 వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయ­చోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement