తూర్పు గోదావరి జిల్లా: పాము పేరు వింటేనే అందరూ భయపడతారు. ఇక నేరుగా చూస్తే దూరంగా పారిపోతారు. అలాంటిది పొలంలో మట్టి తీస్తుండగా గాయపడిన నాగు పాముపై జీవ కారుణ్యాన్ని చూపించి దానిని కాపాడాడు ఒక రైతు. ఆ విష నాగును ఎంతో చాకచక్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వి.సావరంలో గుత్తుల సత్యనారాయణ శనివారం తన పొలంలో మట్టిని తీస్తుండగా నాగుపాముకు దెబ్బ తగిలింది. వెంటనే ఆ పామును వెటర్నరీ హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు పాముకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కుట్లు వేశారు.


