63.33 లక్షల మందికి రూ.1,747.38 కోట్లు | Distribution of pensions from May 1 morning | Sakshi
Sakshi News home page

63.33 లక్షల మందికి రూ.1,747.38 కోట్లు

May 1 2023 5:00 AM | Updated on May 1 2023 9:25 AM

Distribution of pensions from May 1 morning - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 63,33,349 మంది అవ్వా­తా­తలు, వితంతు, దివ్యాంగులు, పలు రకాల చేతివృత్తిదారులు, దీర్ఘ­కాలిక వ్యాధిగ్రస్తులకు సోమవారం (మే 1వ తేదీ) తెల్లవా­రుజా­ము నుంచే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. పింఛన్ల పంపిణీకి గాను రూ.1,747.38 కోట్లను ప్రభుత్వం శనివారమే విడు­దల చేసి ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జ­మ చేసింది.

శనివారం సాయంత్రానికే సచివాలయాల సిబ్బంది బ్యాం­కుల నుంచి ఆ నిధులను డ్రా చేసి వలంటీర్లకు అందజేసినట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు. వలంటీర్లు సోమవారం తెల్లవా­రు­జాము నుంచే లబ్ధి­దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేపడ­తారని ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు చెప్పారు. పింఛన్ల పంపిణీలో ఏ సమస్యలు ఉత్పన్నమైనా అప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో సెర్ప్‌ కార్యాలయంలోనూ, జిల్లాల పరిధిలోని ఆయా డీఆర్‌డీఏ పీడీ కార్యాలయాల్లో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement