ఉద్యోగుల బదిలీల గడువు 9 వరకు పొడిగింపు | Deadline for Govt Employee Transfers Extended to June 9: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల బదిలీల గడువు 9 వరకు పొడిగింపు

Jun 3 2025 4:56 AM | Updated on Jun 3 2025 4:56 AM

Deadline for Govt Employee Transfers Extended to June 9: Andhra pradesh

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ 

బేరసారాల కోసమేనంటున్న ఉద్యోగ వర్గాలు

సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత జారీ చేసిన జీవో ప్రకారం సోమవారంతో గడువు ముగిసింది. వీటిపై మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు మరింత సమయం కోరారు.

దీంతో ఆర్థిక శాఖ  ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌ బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై నిషేధం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టంచేశారు. ఉద్యోగుల బదిలీకి సంబంధించి మంత్రులు, కూటమి ఎమ్మెల్యేల బేరసారాలకు సమయం సరిపోకపోవడంతో గడువు పొడిగించారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement