ఏపీలో ఒక్కరోజే 9125 మంది రికవరీ

Coronavirus In Andhra Pradesh 7293 New Cases Reported - Sakshi

కొత్తగా 7293 కేసులు, 57 మంది మృతి

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ వేల సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 75,990 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 7293 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,68,751 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 9,125 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,97,294.

ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65,794. కోవిడ్‌బారిన పడ్డవారిలో తాజాగా 57 మంది ప్రాణాలు విడువడంతో ఆ మొత్తం సంఖ్య 5663 కి చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా చేసిన పరీక్షల్లో 36,618 ట్రూనాట్‌ పద్ధతిలో, 36,372 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశామని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 55,23,786 నమూనాలు పరీక్షించామని వెల్లడించింది.
(చదవండి: ఏపీ: ముంచెత్తుతున్న భారీ వర్షాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top