సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్, జూలై నెలల్లో ఓ మోస్తరుగా నమోదైన కేసులు ఆగస్టులో భారీగా పెరిగాయి. రోజూ పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే సెప్టెంబర్ ఆరంభం నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. టెస్టులు మాత్రం రోజుకు సగటున 70 వేలకు పైగా చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి ప్రతి 100 టెస్టులకు 16.97 శాతం పాజిటివ్ కేసులు నమోదైనట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అది 11.47 శాతానికి తగ్గింది. మరోవైపు రికవరీ రేటు పెరుగుతుండటం, మరణాల సంఖ్య తగ్గడంతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్, జూలై నెలలతో పోలిస్తే కరోనా మరణాలు గణనీయంగా తగ్గడంతో వైరస్ వ్యాప్తే కాకుండా దాని ప్రభావం కూడా తగ్గినట్లు కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అక్టోబర్ నాటికి కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు బాగా తగ్గాయి.
క్రమంగా తగ్గుతోంది
ఆగస్టులో పీక్ స్టేజికి వెళ్లిన కరోనా ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. పట్టణాల్లో ఇప్పటికే బాగా తగ్గింది. ప్రస్తుతం పల్లెల్లో కేసులు ఉన్నాయి. వచ్చే నెలలో పల్లెల్లో కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తాజాగా నమోదవుతున్న కేసుల్లోనూ తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. లక్షణాలున్న వారు సీటీస్కాన్ చేయించుకుని డబ్బులు పోగొట్టుకోవద్దు. గ్రామాల్లో యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు.
– డా.కె.ప్రభాకర్రెడ్డి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి
ఆగస్టుతో పోలిస్తే కరోనా తగ్గుముఖం
Published Tue, Sep 22 2020 3:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement