వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

CM YS Jagan Wishes To People On Vinayaka Chavithi - Sakshi

సాక్షి, తాడేపల్లి: నేడు వినాయక చవితి పండుగ. దేశవ్యాప్తంగా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక, వినాయక చవితి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

సీఎం జగన్‌..‘ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’ అని ఆకాంక్షిస్తూ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇది కూడా చదవండి: తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్‌ పట్టువస్త్రాల సమర్పణ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top