Breadcrumb
Live Updates
విజయవాడలో సీఎం జగన్ పర్యటన
అందరికీ రంజాన్ శుభాకాంక్షలు: సీఎం జగన్
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
షాజహూర్ ముసాఫిర్ ఖానాను ప్రారంభించిన సీఎం జగన్
విజయవాడలోని వించిపేటలో షాజహూర్ ముసాఫిర్ ఖానాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేసింది. ముస్లింల శుభకార్యాలయాలకు అనువుగా దీనిని తీర్చిదిద్దారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
►వీజీచౌక్ నుంచి పంజాసెంటర్, వించిపేట, రైల్వే బుకింగ్ మార్గంలో వాహనాలను అనుమతించరు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు బ్రాహ్మణ వీధి మీదగా రథం సెంటర్ వైపు వెళ్లాలి.
►ఆర్టీసీ వైజంక్షన్ నుంచి బందరు రోడ్డు మీదుగా బెంజిసర్కిల్కు రాకపోకలు సాగించే వాహనాలు ఐదో నంబర్ రూట్, ఏలూరు రోడ్డు మీదగా రామవరప్పాడు రింగ్ వైపు ప్రయాణించాలి.
►ఇప్తార్ విందుకు హాజరయ్యే ఏ–1 పాస్లు కలిగిన ఆహ్వానితులు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోకి రెండో నంబర్ గేటు ద్వారా ప్రవేశించి ఫుట్బాల్ కోర్టులో వాహనాలు పార్కింగ్ చేరుకోవాలి.
►ఇఫ్తార్ విందుకు వచ్చే ఇతరులు తమ వాహనాలను బిషప్ అజరయ్య పాఠశాల ప్రాంగణం, స్వరాజ్య మైదానంలో పార్కింగ్ చేసి నాలుగు, ఆరో నంబర్ గేట్ల నుంచి లోపలికి ప్రవేశించాలి.
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు, ముసాఫిర్ఖానా ప్రారంభోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నామని పోలీస్ కమిషనర్ టి.కె.రాణా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పంజా సెంటర్, ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వాహనాలను సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఏడు గంటల వరకు మళ్లిస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 లక్షలు మంజూరు
ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హాజరుకావాలని కోరారు. ఎనిమిది వేల మంది ముస్లిం సోదరులకు పాస్లు అందజేస్తామన్నారు. స్టేడియం వాటర్ ట్యాంక్ వైపు గేటు నుంచి సాధారణ ప్రజలకు, బందరు రోడ్డు వైపు ప్రధాన గేటు నుంచి వీఐపీలకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం మైనారిటీ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.
ఇఫ్తార్ విందుకు సర్వం సిద్ధం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పవిత్ర రంజూన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, మైనారిటీశాఖ మంత్రి అంజద్బాషా మంగళవారం ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావులతో కలిసి పరిశీలించారు.
Related News By Category
Related News By Tags
-
NTV జర్నలిస్టుల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: NTV జర్నలిస్టుల అరెస్టులను వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ...
-
చెడును దహనం చేసేది భోగి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రా...
-
వరుస వివాదాల్లో ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దుర్గమ్మ ఆలయ ప్రతిష్ట దెబ్బతింటున్నా అధికారులు, ప్రభుత్వం చోద్యం చేస్తోంది. కనకదుర్గానగర్ పార్కింగ్ వద్ద భక్తులపై దాడి ఘటన కలకలం ర...
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి,గుంటూరు: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల...
-
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశార...


