రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్‌ఐ | CI And SI Caught Taking RS 3 Lakh Bribe In Pulivendula Simhadripuram | Sakshi
Sakshi News home page

రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్‌ఐ

Feb 23 2026 6:28 PM | Updated on Feb 23 2026 7:41 PM

CI And SI Caught Taking RS 3 Lakh Bribe In Pulivendula Simhadripuram

సింహాద్రిపురం:  వైఎస్సార్‌ జిల్లాలోని సింహాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌పై ఏసీబీ జరిపిన దాడుల్లో సీఐ కేవీ రమణ, ఎస్‌ఐ అనిల్‌లు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో బాధితుడిని నుంచి రూ. 3 లక్షల లంచం డిమాండ్‌ చేయడంతో అతను ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. దాంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో సీఐ, ఎస్‌ఐలను పట్టుకున్నారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికాలు దాడులు చేశారు. పులివెందుల రూరల్‌ సీఐ, సింహాద్రిపురం ఎస్‌ఐలను ఈ దాడుల్లో ఏసీబీకి దొరికేశారు. పులివెందులలో అత్యంత వివాదాస్పద సీఐగా కేవీ రమణకు పేరుంది. తాజాగా పోలీస్‌ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం కేవీ రమణను మరింత ఇరకాటంలోకి నెట్టింది. 

విజయనగరం: జిల్లాలోని చాకివలస ఇంచార్జ్‌ వీఆర్వో ఏసీబీకి చిక్కారు. రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇంచార్జ్‌ వీఆర్‌ఓ చిట్టిబాబు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement