సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలను 17వ తేదీ ఉదయం 11 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖ(కేబినెట్ విభాగం)కు పంపించాలని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) జి.సాయిప్రసాద్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.


