ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ

AP Government Orders CID Investigation On Corruption In Fiber Net Project - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, విజయవాడ :  గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో యథేచ్ఛగా అక్రమాలు జరిగాయి. కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంతో  ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండిపడింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top