గవర్నర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ..

AP CM YS Jagan Meeting With Governor Abdul Nazeer - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సాయంత్రం 5గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాజ్‌భవన్‌ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆయన గవర్నర్‌తో గంటకుపైగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరించినట్టు సమాచారం. 
(చదవండి: ఏప్రిల్‌ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top