సాక్షి, అనకాపల్లి: గోదావరి జలాల పనుల్లో కూటమి ప్రభుత్వ డొల్లతనం మరోసారి బయిటపడింది. తుని- పాయకరావు పేట మధ్య తాండవ నదిపై అక్విడెక్ట్ నిర్మాణంలో లీకేజ్ అయి పెద్దఎత్తున గోదావరి నీరు వృథాగా పోతుంది. చంద్రబాబు హారతి ఇచ్చిన కొద్దిసేపటికే లీకేజ్అయి నీరు వృథా పోతుంది.
దీంతో గోదావరి జలాల విషయంలో కూటమి ప్రభుత్వం అశ్రద్ధ మరోసారి తేటతెల్లమైంది. అమరావతి సచివాలయం తరహాలోనే గోదావరి జలాలు పనుల్లో లీకేజీలు జరుగుతున్నాయని ఇష్టానుసారంగా ప్యాజీల అంచనాలు పెంచి నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇలా లీకేజీలు జరుగుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


