దస్తావేజు లేఖర్ల వంటావార్పు | - | Sakshi
Sakshi News home page

దస్తావేజు లేఖర్ల వంటావార్పు

Jul 24 2026 1:27 AM | Updated on Jul 24 2026 1:27 AM

నక్కపల్లి : రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 396ను రద్దు చేయాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు నిరసన కొనసాగిస్తున్నారు. గురువారం నక్కపల్లి సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం వద్ద వంటా వార్పుతో నిరసన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ మాట్లాడుతూ ఈ విధానం వల్ల ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కొరవడుతుందన్నారు. లావాదేవీలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం తగదన్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఆధారపడ్డ వేలాది మంది లేఖర్లు జీవనోపాధి కోల్పోతారన్నారు. వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండలశాఖ అధ్యక్షుడు గొర్ల గోవిందు, మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, మాజీ సర్పంచ్‌లు తళ్ల భార్గవ్‌, సాదిరెడ్డి శ్రీను, దస్తావేజు లేఖర్ల సంఘ నాయకులు దాతారం మురళీకృష్ణ, రమణ బాబు, కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement