కార్పొరేట్ సంస్థల కోసమే బడ్జెట్
కేంద్ర బడ్జెట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేలా ఆర్థిక సహాయం లేదు. ఏపీలో వెనకబడిన ప్రాంతాలుగా ఉన్న ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయల సీమ ప్రాంతాలకు నిధులు కేటాయింపులే లేవు. మహిళా సంక్షేమ, ఉపాధి అవకాశాల ఊసే లేదు. ఈ బడ్జెట్లో ఏజెన్సీలో ఉన్న సహజ వనరులను దోచుకునే బడ్జెట్ ఇది. ఏపీ తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారులను వెళ్లగొట్టి అక్కడ కార్పొరేట్లకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ఊతం ఇచ్చేలా ఉంది. దేశ ప్రజల ప్రయోజనాల కన్నా..కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనమే కనిపిస్తుంది.
– కె. లోకనాథం, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు


