చోడవరం: సీపీఐ నాయకుడు దాడి చేయడంతో గాయపడిన వృద్ధుడు బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చోడవరం పట్టణం బాలాజీ నగర్ వద్ద ఇందల సన్యాసిరావు అనే వృద్ధుడికి సీపీఐ నాయకుడు నేమాల హరికి మధ్య ఈ నెల 3వ తేదీ రాత్రి ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సన్యాసిరావు బుధవారం మృతిచెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరి భార్య చోడవరం పంచాయతీలో వార్డు మెంబరుగా ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చోడవరం సీఐ అప్పలరాజు తెలిపారు.