కిరండూల్‌ రైళ్లు గమ్యం కుదింపు | - | Sakshi
Sakshi News home page

కిరండూల్‌ రైళ్లు గమ్యం కుదింపు

Mar 13 2025 11:56 AM | Updated on Mar 13 2025 11:51 AM

తాటిచెట్లపాలెం: కిరండూల్‌–బచేలి స్టేషన్‌ యార్డ్‌ సంబంధిత భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం సందీప్‌ తెలిపారు. విశాఖపట్నం–కిరండూల్‌(18515) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్‌– విశాఖపట్నం(18516) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 17వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–కిరండూల్‌(58501) పాసింజర్‌ ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్‌– విశాఖపట్నం(58502) పాసింజర్‌ ఈ నెల 17వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement