24న ఎంఎస్‌ఎంఈ వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

24న ఎంఎస్‌ఎంఈ వర్క్‌షాప్‌

May 21 2024 10:15 AM | Updated on May 21 2024 10:15 AM

గోపాలపట్నం (విశాఖ): ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్‌ఎంఈ మేక్‌ ఇన్‌ ఇండియా సపోర్టు స్టార్టప్‌ అండ్‌ అగ్రిటెక్‌, ఆక్వా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్టు ఎంఎస్‌ఎంఈ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ దాసరి దేవరాజ్‌, డీజీఎస్‌ సంతోష్‌కుమార్‌ సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో ఈ వర్క్‌షాప్‌ జరుగుతుందని పేర్కొన్నారు. సపోర్టింగ్‌ హ్యాండ్‌ హోల్డింగ్‌ గైడెన్స్‌, రూ.5 కోట్ల వరకూ రుణ సదుపాయం పొందడంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 23వ తేదీలోగా పెందుర్తి ఎంఎస్‌ఎంఈ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు 98667 93111, 99630 45222 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement