జనగణనపై ప్రజలకుఅవగాహన కల్పించాలి
● కలెక్టర్ దినేష్కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలో జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జనగణన సర్వే బృందాల అధికారులు, సిబ్బందికి శనివారం నిర్వహిస్తున్న రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పదేళ్లకు ఓ సారి జరిగే అతిపెద్ద సామాజిక సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, నియోజకవర్గాల పునర్విభజన, విద్యా,ఉపాఽధి ప్రణాళికలకు ప్రాథమిక డేటా అందిస్తుందన్నారు. 33 ఆంశాలపై ఎన్యుమేటర్లంతా ఇంటింటా తిరిగి ఆయా కుటుంబాల సమాచారం సేకరిస్తారన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రసాద్, డీపీవో చంద్రశేఖర్, డీఈవో రామకృష్ణారావు, ఇన్చార్జి డీఎఫ్వో ఉమామహేశ్వరి పాల్గొన్నారు.


