పక్కాగా మధ్యాహ్న భోజన పథకం అమలు | - | Sakshi
Sakshi News home page

పక్కాగా మధ్యాహ్న భోజన పథకం అమలు

Aug 1 2025 11:27 AM | Updated on Aug 1 2025 11:27 AM

పక్కాగా మధ్యాహ్న భోజన పథకం అమలు

పక్కాగా మధ్యాహ్న భోజన పథకం అమలు

రంపచోడవరం: ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీవో విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యతోనే ఉన్నత స్థాయికి చేరువోవచ్చన్నారు. కళాశాల మైదానంలో చెత్తచెదారం లేకుండా ఎప్పకప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు.

రంపచోడవరం పీవో కట్టా సింహాచలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement