రికార్డ్‌ లక్ష్యంగా యోగాంధ్రకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ లక్ష్యంగా యోగాంధ్రకు సన్నద్ధం

Jun 18 2025 11:13 AM | Updated on Jun 18 2025 11:13 AM

రికార

రికార్డ్‌ లక్ష్యంగా యోగాంధ్రకు సన్నద్ధం

సాక్షి,పాడేరు: గిరిజన విద్యాలయాల్లో విద్యార్థులు యోగాలో ప్రతిభ చూపుతున్నారు. ఉత్తమ శిక్షణ పొందిన 21,800 మంది ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఏప్రిల్‌ 7న అరకులోయ వేదికగా 108 సూర్య నమస్కారాలను విజయవంతంగా ప్రదర్శించి వరల్డ్‌ రికార్డు సాధించారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 21న విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ మైదానం వేదికగా పీఎం నరేంద్రమోదీ సమక్షంలో 25 వేల మంది గిరిజన విద్యార్థిని, విద్యార్థులు 108 సూర్య నమస్కారాలకు సిద్ధమవుతున్నారు. అరకులోయలో వరల్డ్‌ రికార్డు సాధించిన 21,800 మంది మిగిలిన 3,200 మంది విద్యార్థులు యోగా సాధనలో నిమగ్నమయ్యారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాలయాల పీడీలు, పీఈటీలు వారికి ఉత్తమ శిక్షణ ఇస్తున్నారు. వీరిని ఈనెల 20న విశాఖ తరలించేందుకు 500 బస్సులు ఏర్పాటుచేశారు. పూర్తిస్థాయి సౌకర్యాలతో 13 చోట్ల వసతి ఏర్పాటుచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి.

సాధనలో 25వేల మంది

గిరిజన విద్యార్థులు నిమగ్నం

పీఎం మోదీ సమక్షంలో

విశాఖలో 21న ప్రదర్శన

గిన్నిస్‌ రికార్డ్‌ లక్ష్యం

108 సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌ లక్ష్యంగా విశాఖలో గిరిజన విద్యార్థులు యోగాసనాలు ప్రదర్శిస్తారు. ఏయూ ఇంజనీరింగ్‌ మైదానంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 వేలమంది గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతితో పాటు భద్రతా చర్యలు చేపడుతున్నాం.

– ఏఎస్‌ దినేష్‌కుమార్‌, కలెక్టర్‌, పాడేరు

రికార్డ్‌ లక్ష్యంగా యోగాంధ్రకు సన్నద్ధం 1
1/1

రికార్డ్‌ లక్ష్యంగా యోగాంధ్రకు సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement