
6 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల: మండలంలో గరికి బంద గ్రామ సమీపంలో మంగళవారం మాడుగుల పోలీసు లు ఆరు కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం ప్రకారం గరికి బంద వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. పాడేరు నుంచి వస్తున్న స్కార్పియోను ఆపి తనిఖీ చేసి,. నలుగురు నిందితులతో పాటు 6 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని, నంద్యాల జిల్లా బేతంచర్ల ప్రాంతానికి చెందిన నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.