ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Jun 18 2025 11:16 AM | Updated on Jun 18 2025 11:16 AM

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు.మండల కేంద్రం ముంచంగిపుట్టులో మంగళవారం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మండల నేతలు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.హామీల అమలులో ప్రభుత్వం చేస్తున్న వంచనపై చర్చించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టించడం లేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని తెలిపారు. విద్య,వైద్య,వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి రైతుల సంక్షేమానికి,పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారని చెప్పారు.ప్రసుత్త ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు,కేసులతోనే పరిపాలన చేస్తోందన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, రాబోయే రోజులు మనవని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ,వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగబంధు, సర్పంచులు, ఎంపీటీసీలు,మండల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement