
ఉద్యోగ నియామక చట్టం ప్రకటించాలి
● ఆదివాసీ జేఏసీ నాయకుల డిమాండ్
చింతూరు: మెగా డీఎస్సీ ఫలితాలు ప్రకటించే నాటికి షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఐటీడీఏ ఎదుట ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో 35 రోజులపాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను బుధవారం విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డీఎస్సీలో ఏజన్సీప్రాంత ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతో భర్తీ అయ్యేంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. అనంతరం వారు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కుంజా అనిల్, జల్లి నరేష్, మడివి నెహ్రు, పొడియం లక్ష్మణ్, రామకృష్ణ, బాలు, సంకురమ్మ, సాయి, రాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య పాల్గొన్నారు.