ఉద్యోగ నియామక చట్టం ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ నియామక చట్టం ప్రకటించాలి

Jun 19 2025 4:34 AM | Updated on Jun 19 2025 4:34 AM

ఉద్యోగ నియామక చట్టం ప్రకటించాలి

ఉద్యోగ నియామక చట్టం ప్రకటించాలి

ఆదివాసీ జేఏసీ నాయకుల డిమాండ్‌

చింతూరు: మెగా డీఎస్సీ ఫలితాలు ప్రకటించే నాటికి షెడ్యూల్‌ ఏరియా ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఐటీడీఏ ఎదుట ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో 35 రోజులపాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను బుధవారం విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డీఎస్సీలో ఏజన్సీప్రాంత ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతో భర్తీ అయ్యేంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. అనంతరం వారు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కుంజా అనిల్‌, జల్లి నరేష్‌, మడివి నెహ్రు, పొడియం లక్ష్మణ్‌, రామకృష్ణ, బాలు, సంకురమ్మ, సాయి, రాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement