
ఐదుగురు రెవెన్యూ ఉద్యోగులపైక్రమశిక్షణ చర్యలకు ిసిఫారసు
ఎటపాక: లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై రెవెన్యూ శాఖలో ఐదుగురు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆశాఖ రాష్ట్ర విజిలెన్స్ ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. వివరాలివున్నాయి. మండల కేంద్రం ఎటపాకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించి 2018–2021 మధ్య కాలంలో భూమి యాజమాన్య వివరాలు ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీకి రూ.4 లక్షలు సదరు అధికారులు డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు 2021, ఏప్రిల్లో స్పందనకు సీఎంవో కాల్సెంటర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు విచారణ చేసి వివేదికలను రెవెన్యూ ఉన్నతాధికారులకు నివేదించారు. అప్పట్లో ఎటపాక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్లు కారం సుబ్బారావు, సిరిగినీడు సుబ్బారావు, అదనపు రెవెన్యూ అధికారి గొంది రాంబాబు, మండల సర్వేయర్ పల్లి డిల్లీశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఉద్యోగులు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి ఈనెల 16న ఆదేశాలు జారీ అయ్యాయి.
లంచం ఆరోపణల నేపథ్యంలో
విచారించి నివేదించిన ఏసీబీ
పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు