
ఆదుకోవాలని రేఖపల్లి రైతుల వినతి
వీఆర్పురం: పోలవరం నిర్వాసిత ముంపు రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకోవాలని రేఖపల్లి రైతులు కోరారు. ఈమేరకు వారు చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాదిరెడ్డి సత్తిబాబు మాట్లాడుతూ గిరిజన, గిరిజనేతర రైతులకు ప్రభుత్వమే రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందజేయాలని కోరారు. ముంపునకు గురవుతున్న రేఖపల్లి గ్రామాన్ని ప్రయారిటీ హ్యాబిటేషన్లో చేర్చి పోలవరం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అందించే రైతులు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని పీవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిక్కల బాలు, పీసా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సార పాండురాజు, వేటకాని సూరిబాబు, బేతి నాగేశ్వరావు, బేతి తిరుపాతయ్య, శిరపు తాతబాబు, కొట్టి ముత్యాలరావు, వెటకాని రాముడు, కొట్టి కన్నంరాజులు, ఈర్ల శ్రీనివాసరావు, శిరపు వెంకన్న, గాంగులు నాగేశ్వరావు, ముత్యాల జయరాజు, బాగుల రాముడు పాల్గొన్నారు.