జిల్లాలో నిబంధనలను విరుద్ధంగా అనేక పాఠశాలల్లో యూనిఫాం, బుక్స్, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. యాజమాన్యాలు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వాటిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం.
– రాహుల్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై ఫిర్యాదు కోసం పోర్టల్ను ఏర్పాటు చేయడం హర్షణీయం. నిబంధనలు అతిక్రమించే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా అధికారులు సత్వరం తనిఖీలు చేపట్టాలి.
– గొడం కేశవ్,
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి


