‘అరే రాజయ్య.. ఈ సంగతి ఇన్నావా? ఇక నుంచి మన సొసైటీ లీడర్లను ఓట్లేసి ఎన్నుకునే పద్ధతి లేదట.. అధికార పార్టీ నుంచే నామినేట్ చేస్తరట..’ అంటూ మల్లయ్య అనగానే టీ తాగుతున్న రాజయ్య ‘అవునా.. గట్లెట్లుంటది.. గతంలో ఓట్లతోనే కదా డైరెక్టర్లు, చైర్మన్ను ఎన్నుకున్నది. ఇప్పుడు ఉండదంటున్నవ్.. మనకు ఓటు హక్కు పోయినట్టేనా..’ అని అనుమానంగా అడిగాడు. ‘అదే గదా గోస! ఇగ ఎన్నికలే ఉండవట.. పెద్ద లీడర్లు కూర్చొని పేర్లు రాసిస్తారట.. వాళ్లు చెప్పినోళ్లే ఇక చైర్మన్లు, డైరెక్టర్లట!’ అని మల్లయ్య అసహనంగా చెప్పాడు. పీఏసీఎస్ పాలకవర్గాలను నామినేటెడ్ విధానంలో భర్తీ చేస్తామని ప్రభుత్వ ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల్లో సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది.
జిల్లాలో
పీఏసీఎస్లు 28
సంఘాల్లో సభ్యులు 59,483


