ఒక్క ఉట్నూర్ కోటనే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న గోండురాజుల కోటలన్నింటినీ మరమ్మతు చేసి పర్యాటకంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలి. భావితరాలకు గోండు రాజుల చరిత్ర తేలిసేలా చొరవ చూపాలి.
– ఆత్రం జ్ఞానసుధ, నేరడిగొండ, గోండు రాజుల వంశీయురాలు
60 శాతం పనులు
పూర్తయ్యాయి
ఉట్నూర్లో ఉన్న గో ండు రాజుల కోటను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ కలిపి రూ. 3.90కోట్లను మంజూరు చేసింది. పునర్నిర్మాణ పనులు దాదాపు 60శాతం వరకు పూర్తయ్యాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొంత నెమ్మదిగా సాగుతున్నాయి.
– రవికుమార్, పర్యాటక శాఖ జిల్లా అధికారి


