యూనియన్లకు అనుమతి ఇవ్వాలి..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలి. 2017 బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు, 2021 పీఆర్సీని 30శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. ప్రతి నెలా సంస్థకు ఇవ్వాల్సిన రూ.350 కోట్లను కోత లేకుండా చెల్లించాలి. అలాగే పాత బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల చేస్తూ, ఎలాంటి అదనపు ఖర్చు లేని యూనియన్లకు అనుమతి ఇవ్వాలి. అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, వాటిని ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలి.
– ఆబిద్ పాషా, ఈయూ రీజినల్ కార్యదర్శి


