ప్రయాణికులకు మెరుగైన సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు మెరుగైన సేవలు

May 20 2025 12:28 AM | Updated on May 20 2025 12:28 AM

ప్రయాణికులకు మెరుగైన సేవలు

ప్రయాణికులకు మెరుగైన సేవలు

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఆదిలాబాద్‌: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. ఆదిలాబాద్‌ డిపోను సోమవారం ఆయన సందర్శించారు. ఉద్యోగుల సమస్యలు అడిగి తె లుసుకున్నారు. ముందుగా డిపో ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడా రు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంతో మహిళలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారన్నారు. ఆర్టీసీ లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది క లగకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే అ వసరం మేరకు ప్రతీ గ్రామానికి బస్సు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన బ స్సులను సైతం కొనుగోలు చేస్తున్నామని, ప ర్యావరణహిత ఎలక్ట్రిక్‌ బస్సులను సైతం పలు రీజియన్లలో ప్రవేశపెట్టామన్నారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఎలక్ట్రిక్‌ బస్సు ల ఏర్పాటు విషయంలో దూరం సమస్యగా మారిందన్నారు. నిజామాబాద్‌లో చార్జింగ్‌ పా యింట్‌తో అనుసంధానం చేస్తే ఎలక్ట్రిక్‌ బస్సులు నడపవచ్చన్నారు. ఆయన వెంట డిపో మే నేజర్‌ కల్పన తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement