
కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు
● 54 మందికి అందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు పత్రాలు
నిర్మల్ఖిల్లా: జిల్లాకు చెందిన 54 మంది చిన్నారులు కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. స్వరూపిణి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో శిక్షకురాలు నవ్య వినయ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన చిన్నారులు 2023 డిసెంబర్ 24న జీఎంసీ బాలయోగి స్టేడియంలో భారత్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచారు. పరిశీలకుల బృందం ఎంపిక చేసిన మీదట 18 నెలల అనంతరం ధ్రువీకరణ పత్రాలు, మెడల్స్ పంపించినట్లు శిక్షకురాలు నవ్య తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్పీ ఉపేందర్ రెడ్డి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ముత్యంరెడ్డి చిన్నారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు అల్లాడి సురేష్, మహిళా హక్కుల కమిషన్ చైర్పర్సన్ అనిషా, చెనిగారపు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.