జనసంద్రమైన ‘దీక్ష భూమి’ | - | Sakshi
Sakshi News home page

జనసంద్రమైన ‘దీక్ష భూమి’

Jan 12 2026 7:20 AM | Updated on Jan 12 2026 7:20 AM

జనసంద

జనసంద్రమైన ‘దీక్ష భూమి’

● భోగ్‌ బండారో నిర్వహించిన ప్రేంసింగ్‌ మహరాజ్‌ ● ఘనంగా గురుకృపా దినోత్సవం

నార్నూర్‌: మండలంలోని కొత్తపల్లి(హెచ్‌) గ్రామంలో జాతీయ బంజారా దీక్ష భూమి ఆదివారం భక్త జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి బంజా రాలు భారీగా తరలివచ్చారు. దీక్ష గురువు సద్గురు శ్రీ ప్రేమ్‌సింగ్‌ మహరాజ్‌ ఆధ్వర్యంలో గురుకృపా (గురుమిలన్‌) దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ చేసి భోగ్‌ బండారో నిర్వహించారు. ఆధ్యాత్మిక భావనతోనే సమాజం జాగృతం అవుతుందన్నారు. లంబాడా మహిళలు సంప్రదాయ నృత్యాలు, పాటలతో హోరెత్తించారు. ఎంపీ నగేశ్‌ దీక్ష భూమిని సందర్శించి ప్రేమ్‌ సింగ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీక్ష భూమి అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కమిటీకి పూర్తి సహకారం అందిస్తానన్నారు. కాగా దీక్ష భూమి వద్ద మూడు రోజుల పాటు జాతర కొనసాగుతుంది.

జనసంద్రమైన ‘దీక్ష భూమి’1
1/1

జనసంద్రమైన ‘దీక్ష భూమి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement