
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
● మంత్రి సీతక్క
ఆదిలాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణఅభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో దివ్యాంగులకు శనివారం సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేలా ప్ర భుత్వం పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అలింకో సంస్థ సహకారంతో సహాయ ఉపకరణా లను పంపిణీ చేసినట్లు వివరించారు. ఇందులో ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డైరెక్టర్ శైలజ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ: మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల ఆవరణలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపి ణీ నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై దివ్యాంగులకు వాటిని అందజేశారు. ఎంపీ నగేశ్ మాట్లాడు తూ, దివ్యాంగుల సహాయ ఉపకరణాల కోసం కేంద్రం నిధులిస్తున్నా పంపిణీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఫొటో లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ మాట్లాడుతూ, దివ్యాంగులకు బ్యాటరీతో కూడిన స్కూటీలు ఇవ్వాలని మంత్రిని కోరారు.
మంత్రి రాకతో మార్కెట్ బంద్ చేయించిన పోలీసులు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప ర్యటన నేపథ్యంలో ఇచ్చోడలో పోలీసులు మార్కెట్ బంద్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క హజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు శనివారం ఉదయం 8 గంటల నుంచే మార్కెట్ను మూసి వేయించారు. విషయం తెలియక వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అయోమయానికి గురయ్యారు. దీనిపై సొంత పార్టీ నాయకులు సైతం చర్చించుకోవడం కనిపించింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు బంద్ వ్యవహారంపై విస్మయం వ్యక్తం చేశారు.