సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం

Aug 8 2024 11:48 PM | Updated on Aug 8 2024 11:48 PM

సమన్వ

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం

ఆ ప్రతిపాదన విరమించుకోండి

రాష్ట్ర రహదారులపై టోల్‌ చార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధానం సరికాదు. భవిష్యత్‌లో రాష్ట్రంలో ఉన్న 12,650 కిలో మీటర్ల రాష్ట్ర రహదారులపై టోల్‌ వసూలు చేసే ప్రమాదం ఉంది. రోడ్లను అభివృద్ధి చేయడం, వాటిని సక్రమంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో లైఫ్‌ ట్యాక్స్‌, డీజిల్‌, పెట్రోలు, రోడ్లపై సెస్‌లు వసూలు చేస్తూ రూ.కోట్లలో ఆదాయం పొందుతున్న ప్రభుత్వం ఇప్పుడు టోల్‌ పేరుతో అదనపు వసూళ్లకు ప్రతిపాదనలు చేయడం తగదు.

– కారెం వెంకటేశ్వరరావు, సీపీఎం జిల్లా కన్వీనర్‌

సాక్షి, అమలాపురం: ‘మేము అధికారంలో వస్తే రాష్ట్ర ఆదాయం పెంచుతాం.. అభివృద్ధి పనులు చేస్తాం.. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం’ ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడకు వెళ్లినా టీడీపీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలివి. ఇది నమ్మిన జనం కూటమికి ఓట్లు వేశారు. అయితే బాబు మార్కు ఆదాయం పెంచడం వేరే అని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో ఆధునీకరించిన రోడ్లపై టోల్‌ గేట్లు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీపీ)లో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు కీలక రహదారులను ఎంపిక చేసి ‘టోల్‌’ వసూలుకు రెడీ అయ్యింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలక రహదారుల్లో టోల్‌ వసూలుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తొలి దశలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం నుంచి బొబ్బర్లంక (36.40 కిలోమీటర్లు), రాజవరం నుంచి పొదలాడ (30 కిలోమీటర్లు), కాకినాడ జిల్లా పరిధి కాకినాడ నుంచి జొన్నాడ (55 కిలోమీటర్లు), రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం మీదుగా భద్రాచలం (102 కిలోమీటర్లు) వరకూ ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారులను టోల్‌ రోడ్లుగా గుర్తించి వసూలుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్‌అండ్‌బీ నుంచి ప్రభుత్వం సేకరించనుంది. ఇక్కడ టోల్‌ వసూలును బట్టి మిగిలిన కీలక రహదారుల్లో సైతం టోల్‌ నిర్ణయిస్తారు.

కాసుల వేటకు రెడీ

కోనసీమ జిల్లాలో అమలాపురం– బొబ్బర్లంక రహదారి అత్యంత కీలకం. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి రావులపాలెం, అక్కడి నుంచి అటు తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళతారు. అలాగే రాజమహేంద్రవరం, భద్రాచలం వెళ్లేవారు సైతం ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. పొదలాడ– రాజవోలు రహదారి సైతం కీలకమైంది. రాజోలు దీవి నుంచి విజయవాడ, ఇటు రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం వెళ్తుంటారు. ఈ రెండు రహదారులపై వాహనాల తాకిడి అధికం. ప్రయాణికుల వాహనాలతోపాటు వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఆక్వా ఉత్పత్తులు సైతం అధికంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి.

ఫ కాకినాడ నుంచి జొన్నాడ రహదారి ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ప్రధానమైంది. ఇది కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో ఉంది. మధ్యలో రామచంద్రపురం, మండపేట పట్టణాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులతోపాటు కోడిగుడ్ల ఎగుమతి సైతం అధికంగా ఉంటోంది. రాజమహేంద్రవరం నుంచి ఏజెన్సీకి వెళ్లే రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు రహదారికి సైతం వాహనాల తాకిడి అధికం. కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమ జిల్లాల నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రాలకు ఈ రహదారిపై ఉమ్మడి జిల్లా నుంచి ఎగుమతులు అధికంగా జరుగుతుంటాయి. ఇటువంటి కీలక రహదారులపై టోల్‌ గేట్లు పెట్టడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే జాతీయ రహదారులపై ఎడాపెడా టోల్‌ వసూళ్లతో వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. రావులపాలెం నుంచి విజయవాడ రహదారిలో ఏకంగా నాలుగు టోల్‌ గేట్లు ఉన్నాయి. వీటికి అదనంగా స్టేట్‌ హైవేలపై కూడా టోల్‌ గేట్లు మొదలైతే ప్రయాణికులపై మరింత భారం పడనుంది.

అన్ని రోడ్లలోనూ..

స్టేట్‌ హైవేలుగా గుర్తించిన ఈ రోడ్లతోపాటు ఇంచుమించు అన్ని రోడ్లను పీపీపీ పద్ధతిలో ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. స్టేట్‌ హైవేలు అన్నింటినీ పీపీపీ పరిధిలోకి తీసుకు రావాలని ఆయన ఆదేశించారు. తద్వారా ప్రతి స్టేట్‌ హైవేలపై భవిష్యత్‌లో టోల్‌ వసూలు తప్పదని ఆయన తేల్చి చెప్పారు.

గత వైఎస్సార్‌ సీపీ హయాంలో ఆధునీకరించిన అమలాపురం– బొబ్బర్లంక రహదారి

అమలాపురం రూరల్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. గురువారం అమలాపురం కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జేసీ టి.నిషాంతి, జిల్లా అడ్మిన్‌ ఎస్పీ ఖాదర్‌ బాషా, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలో విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన ఉద్యోగులను ఇద్దరి చొప్పున అవార్డులకు ఎంపిక చేయాలన్నారు. చిన్నారులు, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా వేడుకలు ఉండాలన్నారు. ఈ వేడుకలకు జిల్లా ప్రజలు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబికులు, ఇతర ప్రముఖులు ఆహ్వానితులేనని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

యువతకు ఉపాధి కల్పించండి

స్థానికంగా లభించే కొబ్బరి, ఆక్వా ముడి ఉత్పత్తులను విలువ ఆధారితంగా మార్చే రంగంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు స్థానికంగా లభించే ముడి సరకు ఆధారంగా విలువ ఆధారిత రంగాల్లో నైపుణ్యం పెంపొందించే దిశగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారు. మండలాల వారీగా 18–45 మధ్య వయసున్న నిరుద్యోగ యువతను గుర్తించడం, మండలాల పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న వివిధ రకాల యూనిట్ల వివరాలతో ఈ నెల 22 నాటికి నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి ఇ.వసంతలకి్‌ష్మ్‌, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి లోకమాన్‌, వికాస పథక సంచాలకుడు కె.లచ్చారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.కమలకుమారి, డీఆర్‌డీఏ పీడీ శివశంకర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఫ ఆర్‌అండ్‌బీ రహదారులపై

టోల్‌ వసూళ్లకు సిద్ధం

ఫ ఉమ్మడి జిల్లాలో

నాలుగు ప్రధాన రోడ్ల ఎంపిక

ఫ స్పష్టత ఇచ్చిన

ముఖ్యమంత్రి చంద్రబాబు

ఫ పీపీపీపీ పేరుతో ప్రయాణికుల

జేబులకు చిల్లు

గత ప్రభుత్వంలోనే ఆధునీకరణ

కూటమి ప్రభుత్వం తొలి దశలో టోల్‌కు ఎంపిక చేసిన రోడ్లను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆధునీకరించారు. మరీ ముఖ్యంగా రాజవోలు నుంచి పొదలాడ రహదారిని రెండు దశల్లో రూ.26 కోట్లతో అభివృద్ధి చేశారు. పి.గన్నవరం ప్రధాన పంట కాలువను ఆనుకుని ఉన్న ఈ రహదారి పలుచోట్ల కాలువ వైపు కుంగిపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగేవి. వాహనాలు కాలువలోకి దూసుకుపోయి పలువురు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. ఈ రహదారిని విస్తరించడంతో పాటు పలుచోట్ల ఐరెన్‌ రెయిలింగ్‌ వేశారు. అలాగే అమలాపురం నుంచి కొత్తపేట, రావులపాలెం మీదుగా బొబ్బర్లంక వరకూ రూ.రెండు దశల్లో రూ.11.13 కోట్లతో ఆధునీకరించారు. గత ప్రభుత్వం తీర్చిదిద్దిన ఈ రోడ్లపై టోల్‌ గేట్లు పెట్టడం ద్వారా ఆదాయం పొందాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్టేట్‌ హైవేలపై టోల్‌ ప్రతిపాదనలు లేకున్నా అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం టోల్‌ వసూలు చేసేస్తోందని సోషల్‌ మీడియా వేదికగా ఐ–టీడీపీ, జనసేన ఫాలోవర్లు నానాయాగి చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం ‘సాక్షి’గా ప్రకటించినా కిమ్మనకుండా ఉండడం వివేషం.

కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం1
1/5

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం2
2/5

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం3
3/5

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం4
4/5

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం5
5/5

సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement