Zainab
-
అందం కాదు బంధం
ఇప్పుడు అందాలపోటీలు చాలా మారాయి. రంగు, రూపు, ఆకృతి లాంటివాటికి అంత ప్రాధాన్యం ఉండట్లేదు. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యాన్నే ఆరాధిస్తున్నారు. అందుకే అందాలపోటీల్లో ఇన్క్లూజివిటీ పెరిగింది. మేని ఛాయ, ఆకృతి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెబుతున్న మిస్ సోమాలియా జైనబ్(Zainab Jama) బాలీవుడ్ సినిమాలు చాలా చూస్తారట. షారూఖ్ ఖాన్, కరీనా కపూర్ తన ఫేవరెట్ యాక్టర్స్ అని చెబుతున్నారు. ఆమె ఇంకా ఎన్నో విషయాలను ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు.నేను ఎఫ్జీఎమ్ (ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్) సర్వైవర్ని. సోమాలియాలో ఉన్న కామన్ హార్మ్ఫుల్ ప్రాక్టీస్ ఇది. మా దేశంలోని దాదాపు 98 శాతం మహిళలు దీన్ని అనుభవించినవారే! ఇప్పుడున్న ఆడపిల్లల్లో 30 శాతం మంది ఈ ఆచారం బారినపడే వయసుకు చేరుకున్నారు. అంటే ఏడేళ్లకు ఎఫ్జీఎమ్ చేస్తారు. ఎఫ్జీఎమ్ అంటే మహిళల సెక్సువల్ ఆర్గాన్ని కత్తిరించడం. యవ్వనంలో ఆమెకు లైంగికేచ్ఛ లేకుండా చేయడం. లైంగికేచ్ఛ లేకపోతే ఏ మగవాడి ఆకర్షణకు లోనుకారనే ఒక ప్రమాదకర, మూఢ విశ్వాసమన్నమాట.ఇది ఒక్క సోమాలియాలోనే కాదు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇప్పటికీ ప్రాక్టీస్లో ఉంది. ఈ అనాచారం వల్ల మా దేశంలో చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతోమంది అధికరక్తస్రావంతో దాదాపు చావు అంచులదాకా వెళ్లారు. నేను కూడా దీన్నుంచి కోలుకుని.. ఈ కథను షేర్ చేయడానికి చాలా కాలమే పట్టింది. నా కథ విని.. ఇలాంటి దుర్మార్గమైన ఆచారాన్ని రూపుమాపడానికి తగిన స్పందన, సహాయం అందుతుందని ఒకే ఒక ఆశతో నా ఈ కథను నాకు దొరికిన వేదిక మీదల్లా పంచుకోవడం మొదలుపెట్టాను. ఈ బ్యూటీపాజెంట్లో కూడా నా తోటి కంటెస్టెంట్స్కి చె΄్పాను. ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి దురాచారం ఒకటుందని ఈ కంటెస్టెంట్స్లో చాలా మందికి తెలియదు. నా కథ విని చలించిపోయారు.ఫిమో ఇనిషియేటెడ్ ఫౌండేషన్ను స్టార్ట్ చేసి, ఆ దురాచారానికి వ్యతిరేకంగాపోరాడుతున్నానని తెలిసి.. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. నాలో భరోసా నింపారు. బ్యూటీపాజెంట్ అంటే కేవలం స్కిన్ షో మాత్రమే అనుకునేవారు ఈ విషయం విని తమ అభి్రపాయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కంటెస్టెంట్స్లో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రగుల్. అందరం అన్నీ షేర్ చేసుకుంటున్నాం. దానివల్ల వ్యక్తిగత సమస్యలు,పోరాటాలు చిన్నవిగా తోస్తున్నాయి. ఎదుర్కోవడానికి బోలెడంత అండ దొరికిన ఫీలింగ్ కలుగుతోంది. సిస్టర్హుడ్ డెవలప్ అవుతోంది. ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సరికొత్త ప్రయత్నాలకు ప్రేరణనిస్తున్నారు.పాజెంట్ తర్వాత కూడా ఈ బాండింగ్ కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను.కొత్తగా అనిపించడం లేదు.. ఇండియా, ఆఫ్రికా సంస్కృతి, ఆహారపు అలవాట్లకు వస్తే.. ఇక్కడ నాకేమీ కొత్తగా అనిపించట్లేదు. నేను ప్యూర్ వెజిటేరియన్ని. సో ఇక్కడి భోజనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తెలంగాణ నా సొంతింటిని మరిపిస్తోంది. ఈపాజెంట్, కంటెస్టెంట్స్తో బాండింగ్, కొత్త భాషలు, కొత్త కల్చర్స్ తెలుసుకోవడం.. ఇవన్నీ నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్. తిరుగు ప్రయాణంలో ఆ ఎక్స్పీరియెన్సెస్ని, ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానాన్ని తీసుకెళ్దామనుకుంటున్నాను. – సరస్వతి రమమండేలా స్ఫూర్తి నాకు ఏడేళ్లున్నప్పుడు జెనిటల్ మ్యుటిలేషన్ జరిగింది. అదొక పెయిన్ఫుల్æట్రామా. దానినుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాలా ఇంకే అమ్మాయికీ జరగొద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా తొమ్మిదేళ్ల వయసులో మా కుటుంబం యూకేకి మైగ్రేట్ అయింది రెఫ్యూజీగా. అక్కడే ఏవియేషన్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ మేనేజ్మెంట్ చేశాను. ప్రయాణాలన్నా.. ఏరోప్లేన్స్ అన్నా చాలా ఇష్టం. అందుకే అందులోనే చదువు పూర్తి చేశాను. ఒక్క ఎఫ్జీఎమ్ కోసమే కాదు.. ఇలాంటి ఇంకెన్నో దురాచారాలు, హింస మీద అమ్మాయిలు, మహిళలకు చైతన్యం కలిగించే ఎన్నో ఫౌండేషన్స్తో కలిసి పనిచేస్తున్నాను.అమ్మాయిల చదువు కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలతోనూ అసోసియేట్ అయి ఉన్నాను. మహిళలందరినీ ఏకం చేసి వారి మధ్య సిస్టర్హుడ్ను పెంచడానికీ ప్రయత్నిస్తున్నాను. నా మాతృదేశానికి వెళ్లిపోయి.. యుగాలుగా నాటుకుని ఉన్న ఈ అనాచారాన్ని రూపుమాపడమే నా లక్ష్యం. ఇదొక్క సోమాలియాకే పరిమితమైన సమస్య కాదు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఉంది. మార్పు కోసం అన్ని దేశాల్లోనూ వర్క్ చేస్తాను. అయితే ఇది నేనిప్పుడు మీతో చెబుతున్నంత ఈజీ కాదని తెలుసు. మా ట్రెడిషన్ గురించి ప్రపంచానికి చెబుతున్నానని, ధిక్కరిస్తున్నానని బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. వెనకడుగు వేసేది లేదు. ఈ విషయంలో నాకు నెల్సన్ మండేలా స్ఫూర్తి. – ‘మిస్ సోమాలియా’ జైనబ్ -
జైహింద్ అన్నవాడు....
1941. భారత్ నుంచి రహస్యంగా బయటపడిన సుభాష్ ^è ంద్రబోస్ జర్మనీ చేరుకున్నారు. కోనిస్బ్రక్ యుద్ధ ఖైదీల శిబిరాన్ని సందర్శించారాయన. 50,000 మందితో ఒక సైన్యాన్ని నిర్మించి భారత్ను ఏలుతున్న వలస ప్రభుత్వం మీద దండెత్తడం సుభాష్ బోస్ ఉద్దేశం. కోనిస్బ్రక్ యుద్ధ ఖైదీల శిబిరంలో భారతీయులు ఉన్నారు. వారిలో తను స్థాపించబోయే ఆజాద్ హింద్ ఫౌజ్కు సభ్యులను ఎంపిక చేయడం కూడా ఆయన ఉద్దేశం. కానీ లోపల దృశ్యం వేరుగా ఉంది. తన కన్న కలకు భిన్నంగా ఉంది. అక్కడ ఏ ఒక్కరూ మాతృదేశాన్ని సంకేతించే విధంగా పలకరించుకోవడం లేదు. కొందరు ‘నమస్తే’ లేదా ‘నమస్కారం’ అంటున్నారు. ఇంకొందరు ‘రామ్రామ్జీ’ అంటున్నారు. సిక్కులు సత్శ్రీఅకాల్ అంటున్నారు. ముస్లింలు ‘సలామాలేకుం’ అని పలకరించుకుంటున్నారు. ఎవరో ‘జైరామ్జీ కీ’ అన్నారు. అలా కాదు, జాతిజనులు పలకరించుకుంటే అందులో దేశం మాట ధ్వనించాలి. మట్టివాసన గుబాళించాలి. అలాంటి ఒక నినాదం తయారు చేయవలసిందని తన సహచరులకు చెప్పారు సుభాష్ చంద్రబోస్. అందులో తను ఎంతో అభిమానించే మిత్రుడు కూడా ఉన్నాడు. ఆ మిత్రుడు ‘హలో!’ అని పిలుచుకుందాం అన్నాడు. బోస్ ముఖంలో చిరాకు, ఆ మాట విన్నాక. దీనితో ఆ మిత్రుడు కోనిస్బ్రక్ యుద్ధ శిబిరానికి వెళ్లాడు. మళ్లీ అవన్నీ విన్నాడు. చివరికి ‘జైరామ్జీకీ’ అన్నమాట అతడికి ప్రేరణ ఇచ్చింది. ఆ పదం ఆధారంగా జై హిందుస్తానీకి’ అని సృష్టించాడతడు. అదే చివరికి ‘జైహింద్’ అన్న అందమైన నినాదంగా రూపుదిద్దుకుంది. ఆ పదాన్ని సృష్టించినవాడే అబిద్ హసన్ సేఫ్రానీ. నిజాం ఏలుబడిలోని హైదరాబాద్ వాసి. జైన్ ఉల్ అబిదీన్ హసన్ (జూన్ 11, 1911–ఏప్రిల్ 5,1984) నిజాం సంస్థానం రాజధాని హైదరాబాద్లో జన్మించారు. తండ్రి అమర్ హసన్. ఆయన నిజాం రాజ్యంలో కలెక్టర్. తల్లి ఫక్రుల్ హజియా బేగం. ఆమె తీవ్ర బ్రిటిష్ వ్యతిరేకి. నిజాం రాజ్యంలో జాతీయ కాంగ్రెస్ అన్న మాట కూడా వినపడకూడదు. ఇక నాయకులకు ప్రవేశం ఎక్కడిది? అలాంటి కాలంలో హసన్ కుటుంబంలో భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు ఉండేది. హజియా ఉద్యమంలో పాల్గొన్నారు. జైన్ ఉల్ అబిదీన్ హసన్ తన పేరును అబిద్ హసన్ అని క్లుప్తంగా చెప్పుకున్నారు. హైదరాబాద్ చరిత్రకారుడు, ఐఎఎస్ అధికారి నరేంద్ర లూధర్, లియోనార్డ్ అబ్రహాం అనే చరిత్రకారుడు జైహింద్ అన్న నినాదాన్ని బోస్ ప్రేరణతో హసన్ ఎలా రూపొందించింది వెలుగులోకి తెచ్చారు. హసన్ హైదరాబాద్లోనే సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నారు. ఆయన మీద తల్లి ప్రభావం బలంగా ఉండేదని అర్థమవుతోంది. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి చదువుకు స్వస్తి చెప్పేశారు. గాంధీజీ పిలుపు మేరకు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ నాయకత్వానికి ముగ్ధుడై 1931లో సబర్మతి ఆశ్రమానికి వెళ్లి కొద్దిరోజులు అక్కడే ఉన్నారాయన. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంటే అది సాయుధ సమరంతోనే సాధ్యమని హసన్ ఆలోచించడం ఆరంభించారు. ఆ సమయంలో ఇలాంటి ఆలోచనకు వచ్చిన యువకులు భారతదేశంలో చాలా ఎక్కువ. అలాగే తన మిత్రులంతా పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కానీ హసన్ మాత్రం తల్లి ప్రోద్బలంతో ఇంగ్లండ్కు కాకుండా ఇంజనీరింగ్ చదువు కోసం జర్మనీ వెళ్లారు. అంతగా ఆ కుటుంబం ఇంగ్లిష్ జాతిని ద్వేషించేది. 1941లో బోస్ జర్మనీ వచ్చారు. ఈ భూప్రంచంలో ఎక్కడ ఉన్నా భారతీయులంతా బోస్ను ఒక మహోన్నత యోధునిగా గౌరవిస్తున్న కాలమది. అందుకే ఆయనను జర్మనీలోనే కలుసుకున్నారు హసన్. ‘వెంటనే ఉద్యమంలో చేరు’ అని సలహా ఇచ్చారాయన. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఉద్యమంలో చేరతానని అన్నారు హసన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల వ్యామోహం వీడకపోతే, ఒక మహత్కార్యం వైపు దృష్టి సారించడం ఎప్పటికీ సాధ్యం కాదు అని బోస్ స్పష్టంగానే చెప్పారు. దీనితో ఇంజనీరింగ్ వదిలిపెట్టి ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు హసన్. బోస్ జర్మనీ రావడం వెనుక పెద్ద పథకమే ఉంది. భారత్ను వలస పాలన నుంచి విముక్తం చేయడానికి సైన్యం కావాలి. ఆ సైన్యం గుండె నిండా దేశభక్తి ఉండాలి. మత, కుల భేదాలు ఉండకూడదు. కానీఅప్పటికి ఉన్న బ్రిటిష్ పాలనలోని భారతీయ సైన్యంలో సిక్కు రెజిమెంట్, బలూచీ రెజిమెంట్, రాజపుత్ రెజిమెంట్– ఇలా దళాలు విభజించి ఉండేవి. అలాగే మత విశ్వాసాలను అనుసరించేందుకు ఎవరి స్వేచ్ఛ వారికి ఉండేది. ఆ రోజుల్లో సముద్రయానం చేస్తే హిందూ జీవనం అంగీకరించేది కాదు. కానీ ప్రభుత్వం విదేశాలకు వెళ్లమంటే వెళ్లవలసిందే. ఆ విషయంలో వలస ప్రభుత్వం భారతీయ సిపాయిల విశ్వాసాలకు విలువ ఇచ్చేది కాదు. సముద్రయానం అపవిత్రం అనుకోవడం మూఢత్వమని సుద్దులు చెప్పేది. అలా అని వారి మధ్య నెలకొన్న మత, కుల అంతరాలను రూపుమాపే యత్నం మాత్రం చేయలేదు. నిజానికి పెంచి పోషించిందేమో కూడా. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సిపాయిలని ఫ్రాన్స్లో ఒక రాజప్రాసాదంలో ఉంచి వైద్యం చేసేవారు. ముంబయ్ తాజ్ హోటల్ని ఆ నాలుగేళ్లు తాత్కాలిక ఆసుపత్రిగా మార్చినట్టు ఆ రాజప్రాసాదాన్ని కూడా తాత్కాలిక ఆసుపత్రిగా ఉపయోగించారు. అక్కడ రెండు మంచినీళ్ల కుళాయిలు ఉండేవి. ఒకటి హిందువుల కోసం. రెండవది ముస్లింల కోసం. అంటే విదేశీ గడ్డ మీద కూడా విశ్వాసాలను మరచిపోయేవారు కాదు. హిందూ ముస్లిం ఐక్యతకు బలమైన పునాది నిర్మించడమే పునాదిగా లక్నో కాంగ్రెస్ (1916) జరిగింది. బొంబాయి నుంచి జిన్నా, ఇతర నాయకులు, ఆయనకు కాబోయే భార్య ఒక ప్రత్యేక రైలులో లక్నో వెళుతున్నారు. రైలు మధ్య పరగణాలలో ఒక స్టేషన్లో ఆగింది. అక్కడ హిందూ జలం, ముస్లిం జలం అని రాసి ఉందట. ఆఖరికి జర్మనీలో ఉన్న యుద్ధఖైదీల శిబిరంలో కూడా భారతీయ యుద్ధ ఖైదీలు భారతీయులమన్న భావనకు రాలేకపోయారు. వారివారి సంప్రదాయాలను బట్టి, ప్రాంతాలలోని రీతిని బట్టి పలకరించుకునేవారు. ఏ ప్రాంత వారు ఆ ప్రాంతానికి చెందిన వారితోనే కలసి ఉండేవారు. ఇరుగు పొరుగును పట్టించుకునే తత్వం ఉండేది కాదు. అలాంటి సందర్భంలోనే బోస్కు దేశమంతటకీ వర్తించే ఒక నినాదం అవసరమన్న ఆలోచన వచ్చింది. ఆ నినాదం వింటే భారతీయులంతా స్పందించాలి. అబిద్ హసన్ పేరు చివర సేఫ్రానీ అన్న పేరు చేరడం వెనుక కూడా ఆసక్తికరమైన గాథ ఉంది. కలసి భోజనాలు చేయడం, కలసి మెలసి ఉండడం దగ్గర ఉన్న విభేదాలు దేశానికంతటికీ ఒక పతాకాన్ని తయారు చేయడం దగ్గర కూడా తలెత్తింది. హిందువులు కాషాయ పతాకం ఉండాలని కోరారు. ముస్లింలు ఆకుపచ్చ రంగులో పతాకం ఉండాలని పట్టుపట్టారు. కొంత తర్జనభర్జన జరిగిన తరువాత హిందువులు తమ పట్టును వీడి, పతాకం తయారు చేసే స్వేచ్ఛను నాయకత్వానికి వదిలిపెట్టారు. హిందువులు ప్రదర్శించిన ఈ ఔదార్యానికి కృతజ్ఞతగా హసన్, పతాకంలో చోటు ఉండకూడదన్న కాషాయరంగును తన పేరు చివర చేర్చుకున్నారు. ఆ విధంగా అబిద్ హసన్ సేఫ్రానీగా చరిత్ర ప్రసిద్ధులయ్యారు. తన మాటను మన్నించి వెంటనే ఉద్యమంలో చేరినందుకు హసన్కు సుభాష్బోస్ సముచిత స్థానమే కల్పించారు. హసన్ రెండేళ్లపాటు బోస్ కార్యదర్శిగా పనిచేశారు. అజాద్ హింద్ ఫౌజ్లో ఆయనకు మేజర్ హోదా ఇచ్చారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన 1943 నాటి యుబోటు ప్రయాణంలో బోస్ వెంట హసన్ ఉన్నారు. అలాంటి దాంట్లో రోజుల తరబడి ప్రయాణించి జపాన్ సైన్యం చెప్పిన చోటికి వెళ్లి బోస్ వారిని కలుసుకున్నారు. జపాన్ అధికారులు జలాంతర్గామిలో రావడం విశేషం. ఇంఫాల్లో ఐఎన్ఏ చేసిన యుద్ధంలో హసన్ పాల్గొన్నారు. ఇది నాలుగు మాసాల యుద్ధం. 1946లో ఎర్రకోటలో అజాద్ హింద్ ఫౌజ్ మీద విచారణ జరిగింది. హసన్ కొంతకాలం కారాగారం తరువాత విడుదలయ్యారు. కానీ ఆజాద్ హింద్ ఫౌజ్తో తన ప్రయాణం గురించి ఆయన బయట ప్రపంచానికి ఏమీ చెప్పలేదు. ఏదీ రాసిపెట్టలేదు. ఇది పెద్ద నష్టమే. సుభాష్బోస్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత హసన్ తన స్వస్థలమైన హైదరాబాద్ వచ్చేశారు. భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. కానీ అప్పటికే ఆ సంస్థలో రాజ్యమేలుతున్న అవాంఛనీయ ధోరణులు సహించలేక కొద్దికాలానికే విడిచిపెట్టారు. బెంగాల్ ల్యాంప్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ కంపెనీ హసన్ను కరాచీకి పంపించింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు హసన్. నిజానికి ఆ సమయంలో నిజాం రాజ్యం నుంచి చాలామంది పాకిస్తాన్కు వలస వెళ్లిపోయారు. నిజాం కూడా తన విశాల సంస్థానాన్ని పాకిస్తాన్లోనే విలీనం చేయాలని శయాథా యత్నించాడు. అలాంటి సమయంలో పాకిస్తాన్ నుంచి హసన్ ఇండియా వచ్చేశారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు భారత విదేశ వ్యవహారాల విభాగంలో చేరారు. పెకింగ్, కైరోలలో తొలి భారత కార్యదర్శిగా పనిచేసినవారు హసనే. తరువాత బాగ్దాద్, డెమాస్కస్, డెన్మార్క్లలో కాన్సల్ జనరల్గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 1969లో పదవీ విరమణ చేసి మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. హసన్ మంచి కవితా ప్రియుడు కూడా. పర్షియన్, ఉర్దూ కవిత్వాల మీద మంచి అభినివేశం కూడా ఉండేది. అందుకే ఆయన జనగణమన అధినాయక జయహే పాటను ఆ భాషలలోకి అనువదించారు. సుభాష్ బోస్ అంటే హసన్కు పంచప్రాణాలు. ఎలా జరిగిందో తెలియదు. హసన్ అన్న బద్రుల్ హసన్ కుమార్తె సరయా హసన్ అరవింద్ బోస్ అనే బెంగాలీ యువకుడిని పెళ్లి చేసుకున్నారు. ఆయన సుభాష్ బోస్కు స్వయంగా మేనల్లుడు కావడం విశేషం. ఆయన 1948లో జెనీవా వెళుతున్నప్పుడు ఓడలో కలసి ప్రయాణం చేసిన ఒక కుటుంబంలోని బాలిక గీతా డాక్టర్. ఆయనను ఆ వయసు పిల్లలంతా అంకుల్ సేఫ్రాన్ అనే పిలిచేవారట. ఎక్కడ ఓడ ఆగినా మొదట ఆయనే దిగి దగ్గరలోని పట్టణానికి వెళ్లి పిల్లలకు కానుకలు కొని ఇచ్చేవారట. ఓడ బస్రాలో ఆగితే అక్కడ కూడా దిగి ఖరీదైన తివాచీలు కొని తీసుకువచ్చారట. తరువాత ఎప్పుడో ఆమెకు తెలిసిందట– అంకుల్ సేఫ్రాన్ వీరగాధ. తమ త్యాగాలని అంత గుంభనంగా దాచుకున్నారు వారు. ఆజాద్ హింద్ ఫౌజ్లో తాము పడిన కష్టాల గురించి, తిన్న దెబ్బల గురించి ఆయన ఎప్పుడూ వెల్లడించలేదట. నిజానికి బర్మా నుంచి ఇంఫాల్కు జరిగిన సైనిక కవాతులో ఫౌజ్ సిపాయిలు పడిన ఇక్కట్లు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి భారత దేశ ప్రజల గుండెచప్పుడుగా మారిన జైహింద్ సృష్టికర్త తానేనని కూడా ఆయన ఎన్నడూ చెప్పలేదట. - ∙డా. గోపరాజు నారాయణరావు -
మానవ మృగానికి నాలుగుసార్లు మరణదండన
లాహోర్, పాకిస్తాన్ : ఏడేళ్ల బాలికని పైశాచికంగా హింసించి, హత్య చేసి, చెత్త బుట్టలో పడేసిన కేసులో నిందితుడు ఇమ్రాన్ అలీకి శనివారం ఉరి శిక్ష పడింది. లాహోర్ కేంద్ర కారాగారంలో కేసును విచారించిన యాంటీ టెర్రరిజం కోర్టు న్యాయమూర్తి అన్నెంపున్నెం ఎరుగని పసిపాపపై అమానుషానికి ఒడిగట్టినందుకు నాలుగు సార్లు మరణ దండనతో పాటు జీవిత ఖైదు, రూ. 32 లక్షల జరిమానా విధించారు. హత్యానంతరం బాలిక దేహాన్ని చెత్తకుప్పలో పడేసినందుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల ఫైన్ వేశారు. ఇమ్రాన్పై కిడ్నాపింగ్, రేప్, హత్య, టెర్రరిజం సంబంధిత కార్యకలాపాల్లో సంబంధం తదితర ఆరోపణలు ఉన్నట్లు పాకిస్తాన్ జాతీయ పత్రిక డాన్ ప్రచురించింది. నిందితుడు చేసిన నేరాలను కోర్టులో ఒప్పుకున్నట్లు న్యాయవాది తెలిపారు. కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు దోషికి 15 రోజులు సమయం ఉంటుందని వివరించారు. ఏడేళ్ల జైనాబ్ అమీన్ను ఇమ్రాన్ అలీ జనవరి 4న కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి క్రూరాతి క్రూరంగా హత్య చేశాడు. ఈ సంఘటనతో పాకిస్తాన్లో ప్రజాగ్రహం పెల్లుబికింది. చిన్నారులను కూడా కాపాడలేని ఈ పోలీసు వ్యవస్థ ఎందుకంటూ ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకెక్కారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విచారణను సైతం వేగవంతంగా ముగించింది. -
అట్టుడుకుతున్న పాకిస్తాన్
కసూర్ (పాకిస్తాన్) : ఏడేళ్ల బాలికపై పైశాచికత్వంగా దాడి చేసి, హత్య చేసి, చెత్త బుట్టలో పడేసిన సంఘటనతో పాకిస్తాన్లో ప్రజాగ్రహం పెల్లుబికింది. చిన్నారులను కూడా కాపాడలేని ఈ పోలీసు వ్యవస్థ ఎందుకంటూ ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకెక్కారు. పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జైనాబ్(7) తల్లిదండ్రులు ఉమ్రా యాత్రకు సౌదీ అరేబియా వెళ్లారు. దీంతో జైనాబ్ను వాళ్ల ఆంటీ వద్ద వదిలేశారు. గత మంగళవారం ఖురాన్ చదువుకునేందుకు బయటకు వెళ్లిన జైనాబ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన జైనాబ్ ఆంటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఐదు రోజుల తర్వాత బాలిక ఇంటికి ఒక మైలు దూరంలో ఉన్న చెత్తకుప్పలో జైనాబ్ మృతదేహాన్ని గుర్తించారు. జైనాబ్పై నాలుగు రోజుల పాటు పలుమార్లు అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన పాకిస్తాన్ ప్రజలను షాక్కు గురి చేసింది. అన్నెంపున్నెం ఎరుగని పసిగుడ్డులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న రాక్షసుడిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కసూర్ పట్టణంలో బాలికలపై అత్యాచారాలు గత రెండేళ్లుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ తొమ్మిది మంది బాలికలు కామాంధుడి క్రూరత్వానికి తనువు చాలించారు. ఈ దాడులన్నింటికి పాల్పడిన వ్యక్తి ఒకరే అని పోలీసులు వెల్లడించడం కాగా, జైనాబ్ మృతికి నిరసనగా పాకిస్తాన్ జాతీయ చానెల్కు చెందిన న్యూస్ రీడర్ ఒకరు కూతురితో లైవ్లో వార్తలు చదివిన విషయం తెలిసిందే. -
బానిస బాలుడికి పితృప్రేమను పంచిన ముహమ్మద్
ప్రవక్త జీవితం జైనబ్కు యుక్తవయసు రాగానే రబీ కొడుకు అబుల్ ఆస్కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలానికి రుఖియ్య, ఉమ్మెకుల్సూమ్ ల వివాహం కూడా అబూలహబ్ కుమారులతో జరిగిపోయింది. ఇక చిన్నారి ఫాతిమా మాత్రమే వారితో ఉంది. ఒకరోజు బీబీ ఖదీజా తన సోదరుని కొడుకు హకీమ్ బిన్ హిజామ్ దగ్గరికి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు హకీమ్ ఆమెకొక బానిసను ఇచ్చి పంపాడు. ఈ కొత్త కుర్రాణ్ణి చూసి, ‘ఈ పిల్లాడెవరు?’ అని అడిగారు ముహమ్మద్. ‘అబ్బాయి హకీం సిరియా నుండి కొంతమంది బానిసలను తెచ్చాడట. మనకు కూడా ఒక బానిసను ఇచ్చాడు’ అన్నారు ఖదీజ. ‘ఈ పిల్లాడి ముఖంలో మంచితనం ఉట్టిపడుతోంది. ఎంతో తెలివైనవాడు, వివేకవంతుడు కూడా!’ అన్నారు ముహమ్మద్ . ‘అవునండీ. ఇతను చాలా గారాబంగా పెరిగాడట. యాదృచ్చికంగా బనూఖైన్ వారికి చిక్కాడట. వారు సంతలో అమ్మేశారు’ అన్నారు ఖదీజ. ఆయన ఆ బానిస బాలుణ్ణి ఎంతో ప్రేమగా తల నిమురుతూ - ‘‘ఇప్పుడీ పిల్లవాడు నా వాడేనా?’ అన్నారు అర్ధాంగినుద్దేశించి చిరునవ్వుతో.. ‘అయ్యయ్యో! ఎంతమాట. ఈ బాలుడు మీ బానిసే. ఇప్పుడే ఇతన్ని మీకు అప్పగిస్తున్నాను’ అన్నారామె పరమ సంతోషంతో.. అప్పటికప్పుడు ఆ బాలుడికి బానిసత్వం నుండి విముక్తి కల్పించి, తన కొడుకుగా చేసుకున్నారు. అంతేకాదు, మీ అబ్బాయి జైద్ తన వద్ద క్షేమంగా ఉన్నాడని అతని తల్లిదండ్రులకు కబురు పంపారు. ఈ కబురు వినగానే జైద్ తండ్రి, అతని బాబాయి ఆఘమేఘాల మీద మక్కా చేరుకున్నారు. ఎంత కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా వాణ్ణి మాకు అప్పగించండి’ అని ప్రాధేయప డ్డారు. ‘మీరింతగా బ్రతిమాలాలా? కన్నప్రేమను నేను అర్థం చేసుకోగలను. అతను మీ వెంట రావడానికి ఇష్టపడితే మీరు బాబును సంతోషంగా తీసుకెళ్ళవచ్చు. రానంటే మాత్రం బలవంతంగా పంపలేను గదా! నన్ను విడిచి పెట్టనివాణ్ణి వదిలెయ్యడం నా పద్ధతి కాదు’ అన్నారు ముహమ్మద్ ‘అయ్యో! అంతకంటే మహాభాగ్యం ఏముంది. అలాగే ‘చేద్దాం’ అన్నారు వారు పరమ సంతోషంగా. అప్పుడు ముహమ్మద్ జైద్ను పిలిచి ‘చూడు బాబూ జైద్! మనింటికి ఈ ఇద్దరు అతిథులొచ్చారు. వీళ్ళను నువ్వేమైనా గుర్తుపట్టగలవేమో చూడు’ అన్నారు. ‘మా నాన్న, మా బాబాయి’ ఠక్కున చెప్పాడు బాలుడు. ‘వీళ్ళు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నాన్న వెంట ఇంటికి వెళ్ళు. లేదూ ఉంటాను అంటే నా దగ్గరే ఉండు. బలవంతం ఏమీలేదు. నీ సంతోషమే మా సంతోషం’ అన్నారు ముహమ్మద్ జైద్ వెంటనే ముహమ్మద్ని వాటేసుకొని - నేను వెళ్ళను. నేను మీ దగ్గరే ఉంటాను’ అని ఏడుపు లంకించుకున్నాడు. దీంతో ‘తల్లిదండ్రుల్ని, చుట్టాలు పక్కాల్ని, సొంత ఊరిని అందరినీ విడిచి పెట్టి ఇక్కడే బానిసలా బతుకుతానంటావేంట్రా!’ అంటూ మండిపడ్డాడు తండ్రి. ‘ఇక్కడ నేను బానిసలా ఏమీ లేను. సొంత కొడుకులా చూసుకుంటున్నారు. సంతోషంగా ఉన్నాను. ఇంతటి మంచి వారిని నేను వదులుకోలేను’ అన్నాడు జైద్. ముహమ్మద్ ఉస్మాన్ఖాన్ (మిగతా వచ్చేవారం)