-
3 నెలలు..7 వేల లావాదేవీలు
రాజంపేట: అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం టి.కందులవారిపల్లెకి చెందిన సైబర్ నేరగాళ్లు సాయికిరణ్, ప్రశాంత్లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారిని పశ్చిమ బెంగాల్ పోలీసులు కోల్కత తీసుకెళ్లారు. టి.కందులవారిపల్లెకి చెందిన సాయికిరణ్ ఇటీవల హెచ్డీఎఫ్సీ బ్యాంక్లోని తన ఖాతాలో ఉన్న రూ.10 వేలు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఖాతా ఫ్రీజ్ అయి ఉండటంతో బ్యాంక్ అధికారులను కలిశాడు. వారికి అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంతవరకు సాయికిరణ్తో టైంపాస్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఎస్ఐ ప్రసాద్రెడ్డి సిబ్బందితో వచ్చి సాయికిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. సాయికిరణ్పై కోల్కతలో సైబర్ కేసు నమోదై ఉండటంతో పోలీసులు అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సోమవారం కోల్కత్తా పోలీసులు రాజంపేటకు చేరుకున్నారు. పట్టణ పోలీసుల అదుపులో ఉన్న సాయికిరణ్తోపాటు అతడికి సహకరించిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ను కూడా అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లారు. సాయికిరణ్ మూడునెలల వ్యవధిలో ఏడువేల లావాదేవీలు చేసినట్లు తెలిసింది. ఇందుకు 30 సిమ్ కార్డులను వినియోగించినట్లు సమాచారం. ఈ లావాదేవీల్లో దేశవ్యాప్తంగా పలువురి బ్యాంకు ఖాతాలను హ్యాక్చేసి కోట్లాది రూపాయలను వివిధ ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసింది. కొన్ని ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేరాలపై కోల్కతలో నమోదైన కేసులో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. -
బెంగాల్ పోలీసులపై సుప్రీం కన్నెర్ర
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను షేర్ చేసిన వ్యవహారంలో బెయిల్ ఇచ్చినప్పటికీ బీజేపీ నేత ప్రియాంక శర్మను జైలు అధికారులు విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను వెంటనే విడుదల చేయకుంటే కోర్టు ధిక్కార నేరం కింద సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని బుధవారం హెచ్చరించింది. సుప్రీం హెచ్చరికల నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను విడుదల చేశారు. ప్రియాంక అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కారని ఈ సందర్భంగా జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేసింది. మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను ఫేస్ బుక్లో షేర్చేయడంతో ప్రియాంకను మే 10న అరెస్ట్ చేశారు. దీంతో ప్రియాంక న్యాయ వాది సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పశ్చిమబెంగాల్ జైలు అధికారులు ప్రియాంకను విడుదల చేయకపోవడంతో ఆమె సోదరుడు రజీబ్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తీవ్రంగా వేధించారు: ప్రియాంక జైలులో ఉన్నప్పుడు అక్కడి అధికారులు తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని బీజేపీ నేత ప్రియాంక శర్మ ఆరోపించారు. కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా, ప్రతీరోజూ జైలు గదులు మారుస్తూ హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘క్షమాపణలు అడగటానికి, విచారం వ్యక్తం చేయడానికి నేను ఏ తప్పూ చేయలేదు. జైలర్నాతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఓ నేరస్తుడిలా నన్ను జైలు గదిలోకి నెట్టారు. తీవ్రమైన ఎండలు కాస్తుంటే ఒకే గదిలో 40 మంది ఖైదీలను ఉంచారు. నా కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు. నేను విడుదల కావాలంటే ఓ కాగితంపై సంతకం పెట్టాలన్నారు. నాకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అలాగే చేశాను’అని వాపోయారు. -
ఇస్కాన్ సభ్యులను కొడుతున్న పోలిసులు మళ్లీ వీడియో వైరల్
-
మరో నకిలీ వీడియో హల్చల్!
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భగవద్గీత పంచుతున్న ఇస్కాన్ సభ్యులను కొడుతున్న పోలీసులంటూ ఓ వీడియో ఆన్లైన్ గత రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ‘వియ్ సపోర్ట్ నరేంద్ర మోదీ’ గ్రూప్ ఫేస్బుక్లో, ట్విట్టర్లో షేర్ చేస్తోంది. ఇదే వీడియో ఇంతకుముందు 2018, ఏప్రిల్ నెలలో వైరల్ అయింది. గోవాలో ఇస్కాన్ సభ్యులపై క్రైస్తవులు దాడి చేసినప్పటి వీడియో అంటూ నాడు ప్రచారం అయింది. వాస్తవానికి ఈ వీడియో 2008, నవంబర్ 26వ తేదీన ‘హెరాల్డ్గోవా డాట్ ఇన్’ వచ్చిన వార్తకు సంబంధించినది. వెబ్సైట్ను పునరుద్ధరించినందున ఆ సైట్లో వీడియో దొరకలేదుగానీ ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన వార్త, దానికి సంబంధించిన ఫొటో వెలుగు చూసింది. ఆన్లైన్లో నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు వెతికి పట్టుకునే ‘ఆల్ట్ న్యూస్’ దీన్నీ వెతికి పట్టుకుంది. కాషాయ వస్త్రాలు ధరించిన ఓ రష్యా బృందం పెద్ద పెట్టున డోలక్, హార్మోనియంను వాయిస్తూ హరేరామా, హరేకృష్ణ అని పాడుకుంటూ వెళుతుండగా, చాలా సేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి త్వరత్వరగా రోడ్డు పక్కగా వెళ్లాల్సిందిగా ఆ రష్యా బృందాన్ని ఆదేశించారు. దాంతో ఆ బృందం సభ్యులు పోలీసులతో కొట్లాటకు దిగారు. దానికి సంబంధించిన వీడియోనే. ఆ వీడియోలో కనిపిస్తున్నది నల్లగా ఉండే అచ్చమైన గోవా పోలీసులని స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలియకుండా ఉండేందుకు పోలీసుల ముఖాలను కాస్త మార్ఫింగ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో మే 12, మే 19న జరగనున్న మరో రెండు విడతల పోలింగ్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను పోస్ట్ చేసినట్లున్నారు. నాడు ఈ సంఘటన జరిగినప్పుడు గోవాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. -
కర్ణన్ కోసం కాళ్లరిగేలా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అయ్యా...ఎక్కడున్నావయ్యా అని ఉసూరుమంటూ జస్టిస్ కర్ణన్ కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చెన్నైలో ఉన్నాడనే సమాచారంతో నాలుగురోజులుగా వెతుకులాడుతున్న పోలీసు అధికారులు ఆదివారం సైతం పలుచోట్ల గాలించారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా 2015లో సహా న్యాయమూర్తులపై అనేక ఆరోపణలు చేసిన ఫలితంగా కోల్కతా హైకోర్టుకు బదీలీ అయ్యారు. అక్కడ సైతం అదే వివాదాస్పద వైఖరిని కొనసాగించి తోటి న్యాయమూర్తులకు విరోధిగా మారారు. న్యాయమూర్తులకు శిక్షలు విధించేందుకు సిద్దం కావడంతో కర్ణన్ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సైతం కర్ణన్ విమర్శించడంతో ఈనెల 10వ తేదీన ఆరు నెలల జైలు శిక్ష పడింది. కర్ణన్ను అరెస్ట్ చేసే బాధ్యతను కోల్కత్తా పోలీసులకు సుప్రీం కోర్టు అప్పగించింది. అయితే పోలీసులు అరెస్ట్ చేసేలోగా కోల్కత్తా నుండి చెన్నై చేరుకున్న కర్ణన్ చేపాక్ ప్రభుత్వ అతిధిగృహంలో బసచేశారు. అదే రోజు రాత్రి పశ్చిమబెంగాల్ పోలీసులు సైతం చెన్నైకి చేరుకుని పోలీస్ కమిషనర్ను కలుసుకుని చేపాక్ అతిధిగృహానికి చేరుకున్నారు. అయితే కోర్టు దిక్కరణ కేసులో సుప్రీం కోర్టుచే ఆరునెలల జైలు శిక్ష పడిన కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ ఈనెల 10 తేదీన చెన్నై చేరుకుని పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నారని కొందరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నారని మరికొందరు చెప్పడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు రెండు ప్రాంతాలకు పరుగులు పెట్టారు. మరికొందరు చేపాక్ అతిధిగృహం వద్దనే కాపుకాసారు. కర్ణన్ను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులతోపాటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మూడు రాష్టాల పోలీసులకు చిక్కకుండా జారుకున్నారు. కర్ణన్ కోసం ఒకవైపు గాలింపు జరుగుతుండగా తనకు విధించిన ఆరునెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఈనెల 11వ తేదీన కర్ణన్ అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. కర్ణన్ ఎక్కడికీ పారిపోలేదు, చెన్నైలోనే ఉన్నారని అప్పీలు పిటిషన్ దాఖలు చేసిన ఆయన తరపు న్యాయవాదులు ప్రకటించారు. కాగా, కర్ణన్ను అరెస్ట్ చేసి వెంటనే వెళ్లిపోవచ్చని ఆశించిన పశ్చిమ బెంగాల్ పోలీసులకు నిరాశేమిగిలింది. కర్ణన్ అరెస్ట్లో జాప్యం తప్పదని అర్దం చేసుకున్న కోల్కత్తా పోలీసులు చెన్నై ఎగ్మూరులోని ఆఫీసర్స్ మెస్లో బస చేసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement