breaking news
wages increments
-
అమెరికాలో పెరుగుదల Vs భారత్లో తగ్గుదల
ఒకవైపు అమెరికన్ టెక్ నిపుణుల వేతనాల వృద్ధి పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటే, మరోవైపు భారతీయ టెక్ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ సాంకేతిక రంగంలో ఈ విచిత్రమైన వైరుధ్యం ఏర్పడడానికి కారణాలను కొన్ని సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఒకే పరిశ్రమలో, ఒకే రకమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు రెండు భిన్నమైన వేతన ధోరణులను ఎందుకు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ పేరోల్ అండ్ కంప్లయన్స్ ప్లాట్ఫామ్ డీల్ (Deel), ఈక్విటీ మేనేజ్మెంట్ సంస్థ కార్టా (Carta) సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ఈ విశ్లేషణకు దారితీసిన ప్రధాన కారణాలను, ముఖ్యంగా అమెరికాలో వేతనాలు పెరగడానికి, భారత్లో వేతన పరిహారం తగ్గడానికి గల అంశాలను పరిశీలిద్దాం.భారత్లో వేతన పరిహారం తగ్గుదలకు కారణాలుభారతీయ టెక్ నిపుణుల వేతనాలు 2025లో భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్, డేటా సంబంధిత ఉద్యోగుల సగటు పరిహారం 40% తగ్గి 22,000 డాలర్లకు(సుమారు రూ.19.5 లక్షలు) చేరుకుంది. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం కూడా 23,000కు పడిపోయింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు కింది విధంగా ఉన్నాయి.వేతన పెంపులో ఒత్తిడిభారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సంప్రదాయ వేతన పెరుగుదల ఆశించినంత ఉండడంలేదు. కంపెనీలు ప్రస్తుతం ఈక్విటీ-హెవీ పరిహార నమూనాల (Equity-heavy compensation models) వైపు మొగ్గు చూపుతున్నాయి. టెక్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల మొత్తం పరిహారాన్ని పెంచడానికి ఈక్విటీ-ఆధారిత వేతనం (Equity-based pay) ఒక సాధనంగా మారుతోంది. కొన్ని కంపెనీల్లో టాప్ ఎగ్జిక్యూటివ్ల స్థూల వేతనం తగ్గినా ఈక్విటీ గ్రాంట్లు పెరగడం దీనికి సంకేతం.అధిక టాలెంట్ సప్లైభారతదేశంలో టెక్ గ్రాడ్యుయేట్లు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిమాండ్ను మించి సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు వేతనాలపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ వేతనాలతో నాణ్యమైన టాలెంట్ను పొందడానికి భారత్ వంటి మార్కెట్లపై దృష్టి పెడుతున్నాయి.అమెరికాలో వేతనాల పెంపునకు కారణాలుభారత్లో వేతనాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ యూఎస్ టెక్ ఉద్యోగుల సగటు జీతాలు 1,22,000 డాలర్ల నుంచి 1,50,000కు పెరిగాయి. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం 1,38,000 వద్ద ఉంది. ఈ పెరుగుదలకు దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.అధిక డిమాండ్యూఎస్ మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో(AI, మెషిన్ లెర్నింగ్ వంటివి) అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత కారణంగా కంపెనీలు అధిక జీతాలను, ఆకర్షణీయమైన పరిహారాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి.ఈక్విటీ-ఆధారిత పరిహారంనివేదిక ప్రకారం, ఈక్విటీ ఆధారిత వేతనం ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షిస్తోంది. యూఎస్లోని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యంలో వాటాను (ఈక్విటీ) పెద్ద మొత్తంలో అందిస్తున్నాయి. దీని వల్ల మొత్తం పరిహారం (జీతం + ఈక్విటీ) గణనీయంగా పెరుగుతోంది.ద్రవ్యోల్బణం, జీవన వ్యయంఅమెరికాలో అధిక జీవన వ్యయం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి వేతనాలను పెంచడం అనివార్యమవుతోంది.ఇదీ చదవండి: తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్పై ప్రభావం ఎంతంటే.. -
పీరియడ్స్లో వేతన సెలవులివ్వాల్సిందే
సంబాల్పూర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబాల్పూర్ పట్టణ యువతులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలుజారీ చేయాలని ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్ సింగ్కు వినతి పత్రం సమర్పించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99 శాతం మంది మహిళలు గరిష్టంగా 24 గంటలపాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తుచేశారు. భారత్లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవులు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని రంజితా ప్రియదర్శిని స్పష్టం చేశారు. -
కార్మికులకు వేతనాలు పెంచకుంటే ఉద్యమాలే
కరీంనగర్ : ప్రజలు పోరాటాలు చేసిన సాధించుకున్న రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందని, సామాజిక తెలంగాణ కోసం మళ్లీ పోరాటాలు చేయాల్సిన రోజులు వచ్చాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ కార్మికుల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో సీపీఎం, సీపీఐ సహా ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన వామపక్ష బస్సుజాత మంగళవారం రాత్రి కరీంనగర్ చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వీరభద్రం మాట్లాడారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని, లేకపోతే పోలీసులు బలగాలను రంగంలోకి దింపుతామని సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడడంతో వామపక్ష పార్టీలన్ని ఐక్య ఉద్యమాలకు సిద్ధమయ్యూయని అన్నారు. కేసీఆర్ హైదరాబాద్కు మాత్రమే సీఎం అయినట్లు గ్రేటర్ హైదరాబాద్ కార్మికులకు వేతనాలు పెంచి, తెలంగాణ జిల్లాలో ఉన్న ఇతర కార్మికుల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. విధుల నుంచి తొలగించిన 800 మంది కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెల్లబట్టలు వేసికొని కాగితాలపై సంతకాలు చేస్తున్న వారికి వేలల్లో వేతనాలు పెంచుతున్న కేసీఆర్కు ముక్కు మూసుకొని కంపువాసనలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచడానికి మనసు రావడం లేదన్నారు. ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచడంతోపాటు కాంట్రాక్టు కార్మికులందరిని రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో ఈనెల 24న మరో పోరాటాన్ని ప్రకటిస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ చౌక్లో కార్మికులు సభ నిర్వహించుకుంటే కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. ఎన్ని పుష్కరాల్లో స్నానం చేసినా పారిశుధ్య కార్మికుల పాపం ఊరికేపోదన్నారు. సభలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐఎంఎల్ పార్వర్డ్బ్లాక్ నాయకుడు ఈసంపల్లి వేణు, ఎంసీపీఐ(యు) నాయకుడు వి.బాలు, నాయకులు మర్రి వెంకటస్వామి, ఎరవెల్లి ముత్యంరావు, జి.ముకుందరెడ్డి, జీ.భీమాసాహెబ్, కాల్వ నర్సయ్యయాదవ్ పాల్గొన్నారు.


