breaking news
to visit
-
త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్కుక్!
యాపిల్ సీఈవో టిమ్కుక్ భారత్ వస్తారని, ఇక్కడ ఏర్పాటవుతున్న యాపిల్ స్టోర్ ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తారని అంచనా వేస్తూ ఎకనమిక్ టైమ్స్ కథనం వెలువరించింది. ఈ మేరకు టిమ్కుక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉంది. కుక్ 2016లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా మోదీతో భేటి అయ్యారు. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ ప్రధాన కార్యాలయం కుక్ భారత పర్యటన ప్రణాళికను, ముంబై స్టోర్ ప్రారంభ తేదీని ఖరారు చేస్తోంది. కుక్ వెంట యాపిల్ రిటైల్ అండ్ పీపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియన్ ఉంటారని తెలుస్తోంది. టిమ్ కుక్ చివరి సారిగా 2016లో భారత్లో పర్యటించారు. బాలీవుడ్ స్టార్స్, టాప్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశమయ్యారు. స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్ను కూడా వీక్షించారు. ముంబై నగరంలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ నెలాఖరున ప్రారంభించబోతున్న రీటైల్ స్టోర్కు సంబంధించిన ఫొటోలను యాపిల్ విడుదల చేసింది. నగరానికి ప్రత్యేకమైన కాళీ-పీలీ ట్యాక్సీ కళాకృతి ప్రేరణతో ముంబై స్టోర్ ముఖభాగాన్ని తీర్చిదిద్దారు. -
ఈ నెల 16న తూర్పు గోదావరి జిల్లాకు సీఎం జగన్
-
26న నేపాల్ వెళ్లనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు. 26, 27న ఖాట్మండులో జరిగే సార్క్ సదస్సులో మోదీ పాల్గొంటారు. దేశ రాజకీయాలు, అధికార కార్యక్రమాలతో మోదీ తీరికలేకుండా ఉండటంతో నేపాల్ పర్యటనను కుదించుకున్నారు. నేపాల్లోని ఇతర ప్రాంతాల పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. మోదీ ఇటీవల కూడా నేపాల్లో పర్యటించారు. -
నేడు చిత్తూరు పర్యటనకు చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కురుబలకోటలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన కోసం ఆర్టీఏ అధికారులు 400 స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. చిత్తూరు, మదనపల్లె డివిజన్లలో విద్యా శాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.